సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇన్ స్టా గ్రామ్ లో వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాతే ఆ ప్రబుద్ధుడి అసలు రంగు బయటపడింది. నీచుడి బుద్ధి తెలిశాక ఆ డెంటిస్ట్ దూరం పెట్టింది. దాంతో ఆ అమ్మాయి లొంగ లేదని ప్రాణమే తీశాడో దరిద్రుడు.. ఇంత దుర్మార్గమైన నేరం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధించింది గుంటూరు జిల్లాకోర్టు. వివరాల్లోకి వెళితే…
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన మన్నే జ్ఞానేశ్వర్ హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. 2020 నవంబర్ లో చిన అవుటుపల్లి సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో బీడీఎస్ చదువుతూ హాస్టల్లో ఉంటున్న తపస్వి ఇన్ స్టా లో పరిచయం అయ్యింది. ఆమె తల్లిదండ్రులు ముంబయిలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉండేవారు. తపస్వి ఉంగటూరులో బంధువులకు సమీపంలో ఉన్న హాస్టల్లో ఉంటోంది. అప్పుడే జ్ఞానేశ్వర్ తో ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2021 మార్చిలో జ్ఞానేశ్వర్ హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో కేవలం తపస్విని కోసమే ఉద్యోగంలో చేరాడు.
అబద్దాలు చెప్పి…ప్రేయసికి దూరం అయ్యి… Instagram
ఆ తరువాత ఇద్దరూ గన్నవరంలో ఓ గది అద్దెకు తీసుకొని కొంతకాలం ఉన్నారు జ్ఞానేశ్వర్. తనకు డబ్బు అవసరముందని చెప్పడంతో తన దగ్గర ఉన్న బంగారం డబ్బులు కుడా తనకి ఇచ్చేసింది తపస్విని.. ఆ తర్వాతే ఆ నీచుడి అసలు స్వరూపం బయటపడింది. తపస్విని ఇచ్చిన బంగారాన్ని తాకట్టు పెట్టి తన ఆర్థిక అవసరాలు తీర్చుకున్నాడు జ్ఞానేశ్వర్…. అయితే ఆ తర్వాత అతగాడు అబద్ధాలు చెబుతున్నాడని, తాను మోసగాడి వలలో పడిందని అర్ధమైందిన తపస్వినికి.. వెంటనే అతనికి దూరంగా ఉండటం ప్రారంభించింది. ఉంటున్న గది ఖాళీ చేసి తక్కెళ్లపాడులో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయింది. అక్కడనుంచే రోజూ కాలేజీకి వెళ్లి వస్తుండేది.
2022 నవంబరులో తపస్వి ఆచూకీ తెలుసుకుని జ్ఞానేశ్వర్. ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.. పెళ్లి చేసుకోవాలని లేకుంటే అంతు చూస్తానని బెదిరించాడు. ఆ యువతి ఈ ఘటనపై నూజివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని మందలించి ఆమె దగ్గర తీసుకుని తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు యువతికి ఇప్పించారు. దాంతో జ్ఞానేశ్వర్. మరింత పగతో రగిలిపోయాడు.
స్నేహితురాలి ఇంటికి వెళ్లింది అన్ని సమాచరం….. Instagram
అవకాశం కోసం ఎదురు చుస్తున్న జ్ఞానేశ్వర్ కి మూడ్రోజుల కిందట తక్కెళ్లపాడులోని స్నేహితురాలి ఇంటిలో ఉంటున్న విషయాన్ని తెలుసుకున్నాడు . డిసెంబర్ 5న కత్తి,సర్జికల్ బ్లేడులు కొని తన ద్విచక్ర వాహనంపై తపస్వి స్నేహితురాలి ఇంటి వద్దకు వెళ్లాడు ఆమె ప్రియుడు జ్ఞానేశ్వర్. అక్కడ ఇద్దరికీ మాటా, మాటా పెరిగింది.. తపస్వినిని దారుణంగా హత్య చేశాడు. ఆపరేషన్లకు వినియోగించే సర్జికల్ బ్లేడుతో గొంతు కోశాడు. ఆ తరువాత కూడా ఇంట్లోకి ఈడ్చుకెళ్లి పైశాచికంగా వ్యవహరించాడు. తపస్వి స్నేహితురాలి కేకలతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేసరికే ఘెూరం జరిగిపోయింది.
జీవిత ఖైదు విధించిన న్యాయస్ధానం…….
రక్తపు మడుగులో పడి ఉన్న తపస్యిని హుటాహుటిన గుంటూరు జీజీహెచ్ కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణ ఘటన తక్కెళ్లపాడు ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రశాంతమైన పల్లెలో ఇంతటి దారుణం జరగాడన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు స్థానికులు. పెళ్లి చేసుకోవాలంటూ తపస్విని నిందితుడు జ్ఞానేశ్వర్ కొన్నిరోజులుగా వేధిస్తున్నట్లు తెలిసిందనీ, ఇప్పడు ఏకంగా హత్య చేశాడని ఆమె కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.
తపస్వి తల్లిదండ్రులను మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.నిందితుడు ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు పోలీసులు న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు.ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు విధించింది.ఇన్ స్టాలో పరిచయం అమ్మాయి ప్రాణమే తీసింది. అమ్మాయిలు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు..