(IRR)
మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంలా తయారైంది టీడీపీ పరిస్థితి.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో దోషిగా ఆరోపణలెదుర్కొంటున్న చంద్రబాబునాయుడుపై మరో కేసు దాఖలైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కుంభకోణం జరిగిందన్న సీఐడి దానిపై సమగ్ర దర్యాప్తు జరిపి కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ఏ వన్ గా చంద్రబాబు, ఏ–2 నారాయణ, ఏ–3 లింగమనేని రమేశ్, ఏ–4 లింగమనేని రాజశేఖర్, ఏ–5 అంజినీ కుమార్, ఏ–6గా లోకేశ్లపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసం, నారాయణ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది.
అమరావతిని అక్షయ పాత్రగా మార్చుకున్నారు: ఏపీ సీఐడి
రాజధాని అమరావతిని చంద్రబాబు తన అవినీతికి అక్షయపాత్రగా మార్చుకున్నారని ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ను కేవలం కాగితాలమీదే అలై న్ మెంట్ మార్పులు జరిపి వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని సీఐడి గుర్తించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ చైర్మన్గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ కలసి సంయుక్తంగా ఈ అలైన్ మెంట్ మార్పుకు పాల్పడ్డారన్నది సీఐడి అభియోగం.దానికోసం లింగమనేని రమేశ్తో క్విడ్ ప్రో కోకు పాల్పడిన ఈ కేసులో చినబాబు లోకేశ్ కూడా ప్రధాన పాత్ర పోషించారు.
ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ ను మార్చి దానిని ఆనుకుని ఉన్న భూముల మార్కెట్ రేట్ ను ఒక్కసారిగా పెంచేలా ప్లాన్ చేశారు. చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లుకు చేరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను ఖరారు చేయడం వెనుక గూడు పుఠాణీ జరిగింది..
కుట్రకు తెరలేపింది ఇలా… (IRR)
మొదట సీఆర్డీఏ అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించారు. ఈ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెద్దపరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా వెళ్తుంది. అంటే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఈ లైన్ వెళుతుంది. ఈ ప్రతిపాదనలను చంద్రబాబు, నారాయణ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం . దాంతో వీరి ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు.
చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలు ఉన్న తాడికొండ, కంతేరు, కాజలనుఅలైన్ మెంట్ మార్పు కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజలలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. మేర అలైన్మెంట్ను రూపొందించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తీసుకొచ్చారు.
అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్ ప్లాన్లో పొందుపరిచిన అలైన్మెంట్కు అనుగుణంగానే నిర్మాణం ఉండాలని షరతు విధించారు. అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. తాడికొండ, కంతేరు, కాజలలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకునే అలైన్మెంట్ను ఎస్టీయూపీ ఖరారు చేసింది.
రూ.177.50 కోట్ల నుంచి రూ.877.50 కోట్లు
అలైన్ మెంట్ మార్చాక ఒక్కసారిగా పెరిగిన భూముల ధరలు (IRR)
ఇన్నర్ రింగ్ రోడ్డు(IRR) అలైన్మెంట్ మార్పుతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, ఆయన బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. కంతేరు, కాజలలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన 13 ఎకరాలకు ఆనుకునేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు చేశారు. చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తమ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు.
అలైన్ మెంట్ మార్పుతో నాలుగు రెట్లు పెరిగిన భూమి ధరలు (IRR)
ఇన్నర్ రింగ్ రోడ్డు(IRR) మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంలా తయారైంది టీడీపీ పరిస్థితి.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో దోషిగా ఆరోపణలెదుర్కొంటున్న చంద్రబాబునాయుడుపై మరో కేసు దాఖలైంది.
అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది.అప్పట్లో ఆ భూముల విలువ మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు(IRR) మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంలా తయారైంది టీడీపీ పరిస్థితి.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో దోషిగా ఆరోపణలెదుర్కొంటున్న చంద్రబాబునాయుడుపై మరో కేసు దాఖలైంది.
అలైన్మెంట్ తర్వాత ఎకరా రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. కాగా మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల భూముల మార్కెట్ ధర అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగినట్టే. ఇక రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు.
కొత్త అలైన్ మెంట్ కు ఆనుకుని ఉన్న భూముల కొనుగోలు (IRR)
ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును(IRR) మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంలా తయారైంది టీడీపీ పరిస్థితి..ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో దోషిగా ఆరోపణలెదుర్కొంటున్న చంద్రబాబునాయుడుపై మరో కేసు దాఖలైంది.ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ అదనంగా ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది.
కృష్ణా నదికి ఇవతలా అవినీతి మెలికలే
ఇక కృష్ణానదికి ఇవతల విజయవాడ శివారుల్లో కూడా మాజీ మంత్రి పొంగూరు నారాయణ తమ ఆస్తుల విలువ భారీగా పెంచుకున్నారు. సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంటుంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తారు. గుంటూరు జిల్లాలోని నూతక్కి–కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప-ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్రోడ్డు కొనసాగుతుంది.
నారాయణ విద్యా సంస్థల కోసం
మొదట డిజైన్ చేసిన ప్రకారం అలైన్ మెంట్ రోడ్ నిర్మిస్తే ఆ ప్రాంతంలోని నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది.
అందుకే ఈ అలైన్మెంట్పై అప్పట్లో నారాయణ సీఆర్డీఏ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఆర్డీఏ సమావేశంలో అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్మెంట్ను మార్చాలని ఆదేశించారు. దాంతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం–కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు.అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు
ఇన్నర్ రింగ్ రోడ్డును(IRR) మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంలా తయారైంది టీడీపీ పరిస్థితి.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో దోషిగా ఆరోపణలెదుర్కొంటున్న చంద్రబాబునాయుడుపై మరో కేసు దాఖలైంది.నిర్మించేలా మార్పులు చేశారు. దాంతో నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు(IRR)
మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంలా తయారైంది టీడీపీ పరిస్థితి.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో దోషిగా ఆరోపణలెదుర్కొంటున్న చంద్రబాబునాయుడుపై మరో కేసు దాఖలైంది.అలైన్మెంట్ను ఖరారు చేశారు.దాని వల్ల నారాయణ విద్యాసంస్థల భూముల ధరలు కూడా బాగా పెరిగినట్లే.