Israel
ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాదసంస్థ హమాస్ మధ్య రాజుకున్న చిచ్చు వేలాది మంది అమాయకులను బలి తీసుకుంటోంది. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఈ దాడిలో భారీ సంఖ్యలో ప్రాణ, ఆస్తినష్టం సంభవిస్తోంది.అటు అమెరికా, ఇటు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటించడంతో అటు ముస్లిం దేశాలన్నీ ఒక్కటవుతున్నాయి. శనివారం తెల్లవారుజామున మొదలైన ఈ భారీ దాడిలో కీలక మైన పది పరిణామాలేంటోఇప్పుడు చూద్దాం…
ముందే గుర్తించలేక పోయిన ఇజ్రాయెల్ Israel
పాలస్తీనా, హమాస్ నెత్తుటి నరమేధంలో అమాయక పౌరులు బలైపోతున్నారు. గాజా స్ట్రిప్ లో శనివారం నుంచి మొదలైన దాడులలో ఇప్పటి వరకూ 1,100 మంది చిన్నపిల్లలు చనిపోయారు. పాలస్తీనా ఉగ్రవాదులు హటాత్తుగా చేసిన మెరుపు దాడిని ఇజ్రాయెల్ ముందే గుర్తించలేకపోవడంతో భారీ నష్టం జరిగింది.
ఈ దశాబ్ద కాలంలోనే భారీ నరమేథం
ఈ దశాబ్ద కాలంలోనే ఇంత పెద్ద రక్తపాతం ఎప్పుడూ చూడలేదు. హమాస్ వరుస పెట్టున రాకెట్ దాడులకు పాల్పడటంతో ఇజ్రాయెల్ లో 700 మంది చనిపోగా, గాజాలో 400 మంది చనిపోయారు. గాజాలో దాదాపు లక్షమంది అదృశ్యమైపోయి , చెల్లా చెదురైపోయారు. తమ చెరలో వందమంది ఇజ్రాయెలీలు బందీలుగా ఉన్నారని హమాస్ ప్రకటించింది. గాజాలోని 500 హామాస్ కేంద్రాలపై తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. పెరల్ హార్బర్ మూమెంట్ తర్వాత తాము జరిపిన అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ అభవర్ణించింది. అమాయక ఇజ్రాయెల్ పౌరులను ఊచకోత కోసి రక్తపుటేరులు పారించిన చరిత్ర హమాస్ ది అని ఇది తమ దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన దాడి అని ఇజ్రాయెల్ వ్యాఖ్యానించింది.
ఐసిస్ కన్నా క్రూరమైన సంస్థ
హమాస్ ఐసిస్ కన్నా అత్యంత క్రూరమైన, కిరాతకమైన ముఠా అని కామెంట్ చేసింది. వందల సంఖ్యలో ఇజ్రాయెల్ మహిళలు, పురుషులు, చిన్న పిల్లలను చంపేసి, మరికొంతమందిని బందీలుగా గాజాస్ట్రిప్ లోకి ఈడ్చుకు వెళ్లిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇంత భయానకమైన దాడిని తాము అంతే బలంగా తిప్పికొట్టామని, శత్రువును ఎదుర్కొనడానికి తామూ కఠినంగా వ్యవహరించక తప్పటం లేదని ప్రకటించింది.
దాడుల వెనుక ఇరాన్ హస్తం
హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్ నిధులు సమకూర్చి , మద్దతు ఇస్తోంది. అయితే అంశాన్ని టెహరాన్ ఖండించింది. తాజా గొడవలో అసలు తాము తలదూర్చనే లేదని ప్రకటించింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంపై క ప్రకటన చేయడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిరాకరించింది.
తృటిలో తప్పించకున్న భారత జర్నలిస్టులు
ఇజ్రాయెల్ లోని ఆష్కెలన్ హోటల్ పై రాకెట్ దాడి జరగడంతో ఈయుద్ధాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన భారతీయ జర్నలిస్టులు తలోదిక్కుకు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున సైరన్లు మోగడంతో వారు తమ లగేజీని అక్కడికక్కడే వదిలేసి సమీపంలోకి షెల్టర్ లోకి పరుగు తీశారు.
బలగాలను తరలిస్తున్నఅమెరికా
ఇజ్రాయెల్ పై అటు సముద్రంపైనుంచి ఇటు భూమి పై నుంచి జరుగుతున్న దాడుల కారణంగా అనేకమంది అమెరికన్లు కూడా చనిపోయారు. దాంతో అమెరికా తమ యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ లను ఇజ్రాయెల్ కు ఆగ మేఘాల మీద తరలించింది. హమాస్ పై దాడులు ఉథృతం చేయడానికి ఇజ్రాయెల్ కు బేషరతుగా మద్దతు ప్రకటించి ముందుకొచ్చింది అమెరికా.
హమాస్ కు మద్దతుగా లెబనాన్
గత దశాబ్ద కాలంలో ఇంత దారుణమైన రక్తపాతాన్ని ప్రపంచంలో ఎవరూ చూసి ఉండరు. పాలస్తీనియన్ ఉగ్రవాద సంస్థ వేలాదిగా రాకెట్లతో విరుచుకుపడి ఇజ్రాయెల్ సరిహద్దులను ముట్టడించి ఊచకోత కోసేస్తోంది. గాజా స్ట్రిప్ లోని ఈ దాడిలో పెద్ద ఎత్తున అమాయకులు, పిల్లలు, వృద్థులు చనిపోయారు. హమాస్ కి మద్దతుగా రంగంలోకి దిగిన లెబనాన్ క్షిపణులు, రాకెట్లు ప్రయోగిస్తూ అలజడి సృష్టిస్తోంది.
ఇంతకింత తిరిగి ఇచేస్తాం
ఇది ఇజ్రాయెల్ చరిత్రలోనే దుర్దినమని వ్యాఖ్యానించిన ప్రధాని బెంజమిన్ నేతన్యాహు దీనికి ఇంతకి ఇంత ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. హమాస్ స్థావరాలపై దాడులు చేసి వాటిని సమూలంగా ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. హమాస్ ఉనికిని మొగ్గలోకే తుంచేస్తామని అంత వరకూ తమ దాడులు కొనసాగుతాయని ప్రధాని ప్రకటించారు.
గాజాలో పౌరులు వెళ్లిపోండి
గాజాలోని హమాస్ స్థావరాలకు సమీపంలో ఉంటున్న పాలస్తీనా పౌరులు ఆప్రాంతాన్ని వదిలిపోవాలని, హమాస్ స్థావరాలను నేలమట్టం చేస్తున్నామని హెచ్చరించారు ఇజ్రాయెల్ ప్రధాని. గాజా లో సామాన్యులంతా సురక్షిత స్థావరాలకు తరలిపోండి.. ఆ ప్రాంతాన్ని నేల మట్టం చేయడం ఖాయం అని ప్రకటించారు.
అల్ అక్సా కోసమేనన్న హమాస్
2007లో గాజా స్ట్రిప్ పై హమాస్ పట్టు సాధించాక ఇజ్రాయెల్, పాలస్తీనా గ్రూపుల మధ్య చాలా సార్లు యుద్ధాలు జరిగాయి. దురాక్రమణలకు స్వస్తి చెప్పడానికే ఈ దాడులంటూ శనివారం తెల్లవారు జామునుంచి హమాస్ గాజా స్ట్రిప్ సరిహద్దులలో దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధ ఘంటికలు మోగాయి. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ నేరాలకు పాల్పడుతోంది జెరూసలేంలోని ఆల్ అక్సా ప్రాంతంలో ఈ నేరాలు మరీ ఎక్కువైపోయాయి అని హామాస్ ప్రకటించింది.
Israel