జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేడు విశాఖ నేతలతో భేటీ కానున్నారు. వారాహి మూడో విడత యాత్ర పై ఆయన చర్చించనున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా వారాహి యాత్రను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. రెండు విడతల వారాహి యాత్రకు భారీ స్పందన రావడంతో మూడో విడత యాత్రకు కూడా పవన్ సిద్ధమవుతున్నారు.
మూడో విడత యాత్ర…
ఈరోజు జరిగే విశాఖ జిల్లా నేతల సమావేశంలో మూడో విడత వారాహి యాత్రపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇకపై మంగళగిరిలోనే ఉండాలని పవన్ నిర్ణయించుకున్నారు. పార్టీ కార్యాలయంలోనే పవన్ కు ప్రత్యేకంగా ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అందులోనే పవన్ ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా దర్శకులు, నిర్మాతలు కూడా ఇక పవన్ కలవాలంటే మంగళగిరి రావాల్సిందేనని, ఇక్కడే ఉండి పార్టీ బలోపేతానికి పవన్ కృషి చేస్తారని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.