మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ గన్ మెన్లను ప్రభుత్వం తొలిగించింది. ఐదేళ్లుగా ఉన్నగన్ మెన్లు మూడు రోజుల నుంచి విధులకు హాజరు కాకపోవడంతో కన్నా లక్ష్మీనారాయణ దీనిపై ఆరా తీశారు. అయితే తనకు సెక్యూరిటీని ప్రభుత్వం ఉపసంహరించిందని తెలిసిందని ఆయన మీడియాకు తెలిపారు.
సమాచారం లేకుండా…
కనీసం తనకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా సెక్యూరిటీని తొలగించడమేంటని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నిస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు ఉన్నతాధికారులపై వత్తిడి తెచ్చి కన్నా లక్ష్మీనారాయణ గన్ మెన్లను తొలగించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.