(K)
కర్ణాటక మళ్లీ రగిలిపోతోంది. కావేరీ నదీజలాల వివాదంపై రాష్ట్రం అట్టుడుకుతోంది. తమిళ నాడుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని వదలాలంటూ కావేరీ రిగ్యులేటరీ కమిటీ ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్రం రావణ కాష్టంలా మారింది. ఆవేశంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి నినాదాలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసనలకు పాల్పడుతున్నారు. ఆందోళనాకారులు బంద్ కు పిలుపునివ్వడంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. కర్ణాటక నుంచి ఇవాళ బయల్దేరాల్సిన 44 విమాన సర్వీసులను రద్దు చేశారు. తమిళనాడుకు నీటి తరలింపును వ్యతిరేకిస్తూ రైతు సంఘాల ఉద్యమ సస్థ ‘కన్నడ ఒక్కూట’ ఇవాళ కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చింది. బెంగళూరు అర్బన్, మాండ్యా, మైసూరు, చామరజనగార, రామనగర, హస్సన్ జిల్లాలలో సీఆర్ పీసీ సెక్షన్ 144 అమలులో ఉంది. స్కూళ్లు, కాలేజీలకు శెలవులు ప్రకటించారు. బంద్ నేపధ్యంలో కన్నడ సంస్థలకు చెందిన 50 మందిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.చిక్మగళూరులో ఆందోళనాకారులు పెట్రోలు బంకుల్లోకి బైకులపై వచ్చి నిరసనలకు పాల్పడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బెంగళూరులో నిరసనలకు పాల్పడుతున్న ఆందోళనాలకారులను ఫ్రిడమ్ పార్క్ లో నిర్బంధించారు. మాండ్యా జిల్లాలో ఆందోళనాకారులు రోడ్లపై కి వచ్చి నినాదాలు చేశారు.
విమాన సర్వీసులన్నీరద్దు
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన 44 విమాన సర్వీసులను రద్దు చేశారు. వీటిలో 22 ల్యాండ్ అవ్వాల్సిన విమానాలు కూడా ఉన్నాయి. విమాన సర్వీసులను సర్దుబాటు చేసుకోడంలో భఆగాంనే ఈమార్పులు చేసినట్లు ముందుగానే ప్రయాణికులకు సమాచారం ఇచ్చామని విమానాశ్రయ అధికారులు తెలిపారు.కర్ణాటక బంద్ కారణంగాచాలా మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. కన్నడ ఒక్కూట సంస్థ రెండు రోజుల క్రితమే బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చింది. అయితే అప్పట్లో ఆ బంద్ కు మిశ్రమ స్పందన లభించింది. సీఆర్పీసి సెక్షన్ 144 కింద నిషేధపుటుత్తర్వులు ఉన్న కారణంగా ర్యాలీలు, నిరసనలు, ఆందోళనలకుపాల్పడకూడదు. ఎక్కడ ఐదుగురికి మించి గుమికూడరాదన్న ఆదేశాలున్నాయి. అయినా కన్నడ సంస్థలు ఈ ఉత్తర్వులను లెక్క చేయడం లేదు. కన్నడ సంస్థల బంద్ ను 1900 అనుబంధ సంఘాలు సమర్ధిస్తున్నాయి. సరుకుల దుకాణాలు, ఇతర నిత్యావసర వస్తువుల దుకాణాలను సైతం మూసి వేశారు. అయితే ఆస్పత్రులు,అంబులెన్సు సేవలు, ఫార్మసీలు మాత్రం తెరిచే ఉన్నాయి.
నిలిచిపోయిన అంతరాష్ట్ర సర్వీసులు (K)
రాష్ట్ర వ్యాప్త పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని KSRTC,BMTC బస్సులను పరిస్థితిని బట్టి నడిపేది లేనిదీ నిర్ణయిస్తారు. తమిళనాడు-కర్ణాటక మధ్య బస్సు సర్వీసులను నిలిపివేశారు.రేపు పరిస్థితిని బట్టి నడిపేది లేనిదీ నిర్ణయిస్తారు.బెంగళూరులోని ప్రధాన వాణిజ్య కూడళ్లు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో ట్రాఫిక్ లేకపోవడంతో నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
బంద్ కు క్యాబ్ డ్రైవర్ల మద్దతు
ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు సైతం కర్ణాటక బంద్ కు మద్దతు పలికారు. నిరసన ప్రదర్శనల్లో వారు సైతం పాల్గొనే ఛాన్స్ ఉంది.నయన్ద హల్లి నుంచి టౌన్ హాల్ వరకూ క్యాబ్ లతో ఊరేగింపుగా పెరేడ్ చేయాలని నిర్ణయించారు. 32 ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్లు బంద్ కు నైతిక మద్దతును ప్రకటించాయి.
సినిమాల ప్రదర్శన నిలిపివేత, హోటళ్ల మూసివేత (K)
కాగా నిన్న కర్ణాటక హోటల్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ సేవలను నిలిపివేసింది. కర్ణాటక ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిన్నటినుంచి ఇవాల్టి సాయంత్రం వరకూ సినిమాల ప్రదర్శన నిలిపివేసింది. ఏదేమైనప్పటకీ బెంగళూరు నమ్మా మెట్రో సేవలు మాత్రం యధాప్రకారం నడుస్తున్నాయి. మెట్రో స్టేన్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.కావేరీ సమస్యపై రెండు రాష్ట్రాలు చాలా చిత్తశుద్ధితో పోరాడుతున్నాయి. కరవమంటే కప్పకుకోపం. విడవమంటే పాముకు కోపం లా తయారైంది పరిస్థితి. రాష్ట్రం పట్ల కర్ణాటక, తమిళనాడు ప్రజల్లో ఉన్న చిత్తశుద్ధి, అంకిత భావం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కనిపించదు.