మహారాష్ట్రలో అభివృద్ధి ఎందుకు సాధ్యం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. షోలాపూర్ జిల్లాలోని సర్కోలిలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. పొరుగున ఉన్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మహారాష్ట్ర ఎందుకు డెవలెప్ కావడం లేదని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో వనరులకు తక్కువమే లేదన్నారు.
మహారాష్ట్రలో…
స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా అభివృద్ధి చేయకుండా ఈ ప్రభుత్వాలు ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నాయన్నారు. భారత దేశాన్ని యాభై ఏళ్లు కాంగ్రెస్ పాలించి కనీసం నీటి సదుపాయాన్ని కూడా కల్పించలేకపోయిందన్నారు. మహారాష్ట్రలో సాగునీరు, తాగునీరు, విద్యుత్తు సక్రమంగా లేక ప్రజలు పడే ఇబ్బందులు ఇంకా ఎన్నేళ్లు కొనసాగాలని ఆయన నిలదీశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, బీజేపీకి అవకాశం ఇచ్చినా ఎందుకు అభివృద్ధి కాలేదన్నారు.
తెలంగాణలో తొమ్మిదేళ్లలోనే…
తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్లలోనే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించామన్న కేసీఆర్ అదే అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాలేదని అన్నారు. తమను బీజేపీ బీ టీంగా చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, తమది రైతు అనుకూల ప్రభుత్వమని ఆయన తెలిపారు. తమ నినాదం కూడా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని ఆయన అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని, ఇన్నాళ్లు దానిని విస్మరించారని ఫైర్ అయ్యారు.
Follow Us On : YouTube , Google News