ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రయోజనాలు అందించి ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలోనే ప్రత్యేక కమిటీని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేయనున్నారు.
రెండో పీఆర్సీ…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి పీఆర్సీని కేసీఆర్ అమలు చేశారు. ఉద్యోగులు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఇచ్చారు. ఇప్పుడు రెండో పీఆర్సీని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తిని తొలగించే పనిలో భాగంగా పీఆర్సీని అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఉద్యోగుల ఆరోగ్య పథకంపై కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు వెల్లడయ్యే అవకాశాులున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల కేటాయింపుపై కూడా ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.