మహానటి ఫేమ్ కీర్తి సురేష్(keerthy suresh) పెళ్లి పై వచ్చే పుకార్లు అన్నీ ఇన్నీకావు.. అయితే ప్రతీసారి ఆ వార్తలు ఫేక్ అని కొట్టి పారేస్తోంది ఆ ముద్దుగుమ్మ.ఈసారి ఆమెపేరు మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ తో జతపడి పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్లు వ్యాపిస్తున్నాయి. జవాన్, జైలర్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసి నేషనల్ వైడ్ రాక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్ మ్యూజికల్ హిట్ తో దూసుకుపోతున్నాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా మహానటి కీర్తి సురేశ్ తో ఏడడుగులు వేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేశ్, అనిరుద్ ఇద్దరూ ఇష్టపడుతున్నారని ప్రస్తుతం వారు డేటింగ్ లో ఉన్నారని వార్తలు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. ఎప్పటి నుంచో ఎన్ని పుకార్లు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు అయితే దీని పై రీసెంట్ గా కీర్తి తండ్రి సురేశ్ కుమార్ స్పందించారు. ఇదంతా ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. ఎవరో కావాలని అనిరుధ్, కీర్తి సురేశ్ ల గురించి ఒక వార్తను క్రియేట్ చేసి దానిని ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు.
వియ్ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్
మరొకవైపు కీర్త సురేశ్ కూడా తన డేటింగ్ లైఫ్ గురించి వచ్చిన పుకార్లను ఖండించింది అది అంతా ఫేక్ న్యూస్ అని చెప్పింది. అనిరుధ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమేనని ఆమె తెలిపింది. మా ఇద్దరి మధ్య ప్రేమగాని, డేటింగ్ ఏమి లేవు అని క్లారీటి ఇచ్చింది. ఇకపోతే అనిరుద్, కీర్తి సురేశ్ మధ్య ఈ పుకార్లే రావడానికి కారణం అజ్ఞాతవాసి, గ్యాంగ్, రెమో, సినిమాలలో కీర్తి హీరోయిన్ గా అనిరుధ్ మ్యూజిక్ డైరక్టర్ గా కలిసి పనిచేశారు. ఇలా వీరిద్దరూ బ్యాక్ టూ బ్యాక్ కలిసి పని చేయడం క్లోజ్ గా ఉండడం, క్లోజ్ గా ఫొటోస్ దిగడం తో రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇటీవల ఆమె జవాన్ లోని బ్లాక్ బస్టర్ సాంగ్ చలేయ పాటకు డైరక్టర్ అట్లీ భార్య కృష్ణప్రియతో కలిసి డాన్స్ కూడా చేసింది. ఆ వీడియో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. గతంలోనూ కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఈమె పెళ్లి గురించి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఎన్నోసార్లు ఈ వార్తలపై కీర్తి స్పందించి ఆ వార్తలను ఖండించింది.
సుశాంత్ తో ఎంగేజ్మెంట్? (keerthy suresh)
అక్కినేని వారి మనవడు సుశాంత్ తో కీర్తి ఎంగేజ్ మెంట్ అయిందంటూ ఆ మధ్య పుకార్లు వచ్చాయి. కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అవ్వేమీ నిజం కాదని అర్ధమవుతోంది. గతంలో కూడా దుబాయి బేస్డ్ బిజినెస్ మన్ తో కీర్తి మ్యారేజ్ జరుగుతుందనే న్యూస్ వచ్చింది. ఆమె సోషల్ మీడియాలో ఒక ఫోటోను పోస్ట్ చేయడంతో పెళ్లి పుకార్లకు ఆజ్యం పోసింది. అయితే ఈ వార్తలు వైరల్ కావడంతో ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి తన స్నేహితుడని ఆమె స్పష్టం చేసింది. ఎవరో కావాలనే ఈ ఫేక్ న్యూస్ రాస్తున్నారని తెలిపింది. మలయాళ నటి మేనక కుమార్తె అయిన కీర్తి సురేశ్ హీరోయిన్ గా 2000లో మలయాళంలో వచ్చిన పైలట్స్ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాలో నిలదొక్కుకుంది. నేను లోకల్ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన దసరా సినిమాతో అద్భుతమైన హిట్ అందుకుంది. ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పి అందరిని మెప్పించింది. తన పెర్ఫార్మన్స్ తో కీర్తి అదరగొట్టింది.