తిరుమలలో మరోసారి చిరుత (leopard) అధికారుల చేతికి చిక్కింది.అలిపిరి నడక మార్గంలో భక్తులు వెళ్లాలంటే భయపడుతున్న తరుణంలో మరోసారి చిరుత కనిపించడంతో భక్తుల్లో భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి ఆలయం దగ్గర7వ మైలు రాయి ప్రాంతంలో అధికారులు పెట్టిన బోనులో చిరుత చిక్కింది. దీంతో రెండు నెలల్లో మొత్తం ఐదు చిరుతలను అధికారులు పట్టుకున్నారు.తిరుమల శ్రీవారికి భక్తులు ఎక్కువ. స్థానికంగానే కాదు ప్రపంచం నలుమూలలనుంచి ఆయన్ను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.వీరిలో నిరుపేదలు , లేదా స్వామిని మొక్కుకున్న వారు నడకమార్గంలో కొండపైకి చేరుకుంటారు. అయితే ఈ నడక మార్గానికి ఇరువైపులా అడవి ఉండటంతో ఇలా అడవి జంతువుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలిపిరి మార్గం అంత అడవి మధ్యలోంచి ఉన్నట్లుగా ఉండే మెట్ల మార్గమే.. భక్తులు కొండ ఎక్కుతూ అప్పుడప్పుడు మార్గ మధ్యంలో ఇరువైపులా ఉండే గట్లపై కూర్చుని సేద తీరుతుంటారు. మెట్ల మార్గానికి అటూ ఇటూ నిర్మానుష్య అటవీ ప్రాంతం కావడంతో క్రూరమృగాలు ఇలా భక్తులపై దాడి చేస్తున్నాయి.ఎక్కువగా చిరుత,లేదా పులులు ప్రయాణికులపై దాడులకు పాల్పడుతున్నాయి.
స్మగ్లర్ల పనా? (leopard)
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు ఇలా చిరుతల (leopard) దాడిప్రచారంతో అధికార్ల దృష్టి మళ్లిస్తున్నారని మొదట్లో కొట్టి పారేశారు.కానీ ఇటీవల చిరుతలను స్థానికంగా చూసిన భక్తులు హడలిపోతున్నారు.
ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరుజిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందింది.. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి.
చేతి కర్రల పంపిణీ (leopard)
ఈనేపధ్యంలోనే టీటీడీ బోర్డు ప్రయాణికులకు చేతి కర్రలను పంపిణీ చేసింది. ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి బుధవారం కాలినడక మార్గంలో భక్తులకు ఉచితంగా చేతికర్రలు పంపిణీ చేశారు. దీనివల్ల క్రూర మృగాల బారినుంచి తప్పించుకోడానికి వీలవుతుందని, పైగా భక్తుల చేతిలో కర్రలుంటే చిరుతలు (leopard) కూడా దాడి చేసేందుకు భయపడతాయని అధికారులు అంటున్నారు.అంతేకాదు భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని అప్పుడే చిరుతలు భయపడి వెనక్కు తగ్గుతాయని అధికారులు సూచిస్తున్నారు.
చిరుతలు ఎక్కడున్నాయ్? (leopard)
అలిపిరి కాలినడక మార్లో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 38వ మూలమలపు ప్రాంతాల్లోనే ఎక్కువగా చిరుతల దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఐదు ప్రాంతాల్లో చిరుతలు తిరగడాన్ని అధికారులు సిసి కెమెరాల్లో గుర్తించారు. వాటిని బంధించేందుకే ఐదు బోనులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు చిక్కిన చిరుత కూడా అలాగే చిక్కింది.
చిరుతల దాడుల నేపధ్యంలో కాలినడక మార్గంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటయ్యాయి. భక్తుల రక్షణకోసం నిబంధనలు సైతం కఠినం చేశారు.అలిపిరి కాలినడక రూట్ లో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఇక 15 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. చిన్నారుల చేతికి ట్యాగ్ లను అతికించి పంపుతారు. తిరుమల శ్రీవారిని మొక్కుకున్న వారు కాలినడకన వచ్చి మొక్కు తీర్చుకోవడ ఆనవాయితీ. మెట్ల మార్గంలో ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ మెట్లెక్కుతూ.. మధ్య మధ్యలో సేద తీరుతూ తిరుమల మొక్కు తీర్చుకుంటారు.
తాజా గా చిరుతల నేపధ్యంలో కాలినడక మార్గంలో భక్తుల రద్దీ తగ్గుతోంది. మెట్ల మార్గానికి రెండు వైపులా ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అప్పుడే చిరుతల నుంచి రక్షణ ఉంటుందని భక్తులు సూచిస్తున్నారు.అయితే చాలా పొడవైన ఈ రూట్ లో ఫెన్సింగ్ ఏర్పాటు అంటే చాలా ఖర్చుతో కూడినపని. పైగా దాని నిర్వహణ కూడా పెద్ద భారమే. అయితే అలిపిరి దగ్గర కనిపించిన ఐదు చిరుతలను పట్టేశారు కాబట్టి చిరుతల దాడులు మళ్లీ ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. ఏదేమైనా భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని మాత్రమే మెట్ల మార్గంలో వెళ్లాలని టీటీడీ అధికారులు చెబుతున్నారు.