యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబోలో మరో భారీ మూవీ రాబోతోంది. విశేషమేమంటే వాళ్లిద్దరూ పౌరాణిక పాత్రలు నటించడం. 16 ఏళ్ల తర్వాత వీరిద్దరి జోడి మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది. అసలు విషయం ఏమిటంటే ప్రామిసింగ్ స్టార్ మంచు విష్ణూ డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప షూటింగ్ మొదలు పెట్టారు… ఇటీవల శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. విఘ్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
కన్నప్ప ప్రాజెక్ట్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శివుడిగా కనిపించనున్నారని … అలాగే లేడి సూపర్ స్టార్ నయనతార పార్వతి పాత్రలలో నటించనున్నారని ఆ ట్వీట్ లో తెలిపారు. హర హర మహదేవ్ అంటూ ఆ ట్వీట్ లో కామెంట్ చేశాడు మంచు విష్ణూ. ఈ కామెంట్ తో ప్రభాస్ కన్ఫామ్ అయినట్లే. అయితే ప్రభాస్ పాత్ర గురించి సోషల్ మీడియాలో రూమర్స్ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. మొత్తనికి ప్రభాస్, నయనతార శివపార్వతులుగా మన ముందు నటించడానికి రెడిగా ఉన్నారని అర్థం అవుతోంది. ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రభాస్ పాత్ర పై అలనాటి మధుబాల మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మధుబాల ఆనాడే చెప్పారా?
అలనాటి అందాల తార ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ నయనతార శివ పార్వతులుగా కనిపించనున్నారని అందులో మోహన్ బాబు తనయుడు మెయిన్ లీడ్ చేస్తున్నాడనీ చెప్పుకొచ్చింది. అయితే మూవి పేరు మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
మూవీ మేకర్స్ వివరాలు.
ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపుర్ కీలకపాత్రలో నటించనుంది. న్యూజిలాండ్ లో అందమైన లొకేషన్స్ లో ఈమూవీ షూటింగ్ షూరూ అయిందని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు మేకర్స్. అవా ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లపై విష్ణూ మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ టీవీసీరియల్ లో భీష్మ పాత్రధారి ముఖేష్ కుమార్ సింగ్ ఈసినిమాకి దర్శకత్వం వహించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయతలు. కన్నప్ప సినిమాలో ఎంతో మంది సూపర్ స్టార్లు నటించబోతున్నారు. ఈ సినిమా దాదాపుగా రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
విష్ణూ రియాక్షన్ మూవీ
విష్ణూ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను తెరకెక్కించే క్రమంలో తోడ్పడుతున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పుకుంటున్నాను అని తెలిపారు. ఆ శివ పార్వతుల ఆశీస్సులతోనే ఏడేళ్ల నా శ్రమ, కల నిజం కాబోతోంది అన్నాడు విష్ణూ. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతి ఒక్కరు గత ఎనిమిది నెలలుగా ఎంతో కష్టాన్ని చూశారని నిద్రలేని రాత్రలు గడిపారని పండగలు, పబ్బాలు అన్ని మర్చిపోయి… రోజుకు ఐదు గంటలే నిద్రపోయారని అంతటి కృషితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని విష్ణూ తెలిపారు. నన్ను నమ్మి ఇంత భారీ ప్రాజెక్టు ఇచ్చిన అందరికి నా ధన్యవాదాలు అంటు ట్వీట్ చేశాడు విష్ణూ. నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించిన మా నాన్న గారికి థ్యాంక్స్..నా బ్రదర్ వినయ్ ప్రోత్సాహం నేను ఎప్పటికి మరచిపోలేను అంటు తెలిపారు విష్ణూ.
ఏడుళ్లక్రితం కన్నప్ప స్టోరి చెప్పిన తనికెళ్ల భరణి
ఏడేళ్లక్రితం నటుడు తనికెళ్ల భరణి తొలిసారి ఈ కథ గురించి చెప్పినప్పుడే సినిమా స్థాయిని ఊహించుకున్నా. ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్రప్రసాద్, తోటపల్లి సాయినాథ్, తోట ప్రసాద్, నాగేశ్వరరెడ్డి, ఈశ్వర్ రెడ్డి ఇలా ఎంతో మంది ప్రముఖులు కలిసి ఈ మూవీ స్టోరి అద్భుతంగా మలిచారు. ఈ సినిమాకు ప్రాణం పోసేందుకు ఇప్పుడు ఆరువందల మంది పని చేస్తున్నారు.