MILLETS
చిరు ధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం అనేక రకాల చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో అండు కొర్రలు ఒకటి. ఇతర చిరు ధాన్యాల లాగా ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ అండు కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. వీటిని ఆహరంలో చేర్చకోవడం వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా అనేక రకాల వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడొచ్చు.
రైస్ కు బదులు అండుకొర్రలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..MILLETS
వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు. అలాగే అధిక బరువుతో బాధపడే వారు ఈ అండు కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. వీటిలో ఉండే విటమిన్ బి1, బి3 లు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండె సమస్యలు ఉన్నవారు కొర్రలను ఆహరంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అండు కొర్రలు షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.
ఐరన్ పుష్కలం.. MILLETS
వీటిలో ఐరన్, కాల్షయం సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. మరియు కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందేలా చేస్తాయి. దీనిలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యని కూడా తగ్గిస్తుంది. వీటిలోని కాల్షియం ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. మరియు దీర్ఘకాలిక కండరాల సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ఎంతో సహయపడుతుంది.
నాడీ వ్యవస్ధకు మరియు మెదడుకు అండు కొర్రలుతో ఆరోగ్యం..
ఇవి ఆహరంలో భాగంగా చేర్చుకోవడం వల్ల నాడీ మండల వ్యవస్థ యొక్క ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రస్తుతం చిన్న పెద్ద అని తేడా లేకుండా అనేక మంది నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. వీటిని ఆహరంలో భాగంగా చేర్చకోవడం వల్ల నాడీ సంబంధిత సమస్యల నుండి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. అల్జీమర్స్ ఉన్నవారు కొర్రలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొర్రల్లో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి.. మెదడును యాక్టివ్ గా పని చేసేలా చేస్తాయి.. మెదడు అభివృద్ధికి సహయపడతాయి.. వీటిని తినడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది. దీంతో జ్ఞాపకశక్తి , ఏకాగ్రత పెరుగుతుంది. ఈ విధంగా అండు కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పూర్వికుల ఆహరంతో.. దీర్ఘకాలిక సమస్యలు మాయం..MILLETS
మన పూర్వకాలంలో ఆహరంగా ఎక్కువ చిరుధాన్యాలనే వాడేవారు. జోన్నలు, సజ్జలు, రాగులు, గోధుమలు , కొర్రలు , అండు కొర్రలు ఇలా ఎన్నో రకాల చిరుధాన్యాలను ఆహరంలో భాగంగా తీసుకునేవారు. ఆ కాలంలో ఇటువంటి ఆహరం తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండేవికావు. ప్రస్తుత కాలంలో మన ఆహరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దాని ద్వారా ఎన్నో దీర్ఘకాలిక సమస్యలతో భాధపడుతున్నారు. కాబట్టి మన పూర్వికులు తీసుకునే ఆహరాన్ని మనం కూడా ఆహరంలో భాగంగా చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుండి కొంతవరకు అయినా నియంత్రించవచ్చు.