కోకాపేట్ భూములు రికార్డు స్థాయిలో ధరలు పలకడంపై అసెంబ్లీలోనూ మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. కోకాపేట్ భూములు అంత మొత్తంలో వేలంలో అమ్ముడు పోతాయాని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు కుంభకోణాలు.. లంబకోణాలు అంటూ కామెంట్స్ చేయడమే కాని వాస్తవ పరిస్థితులను తెలుసుకోలేకపోతున్నారన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే కోకాపేట్ భూమి ధర అత్యంత ఎక్కువగా పలికిందన్నారు.
కారణాలు…
దీనికి ప్రధాన కారణం స్టేబుల్ గవర్నమెంట్తో పాటు క్యాపబుల్ లీడర్షిప్ కారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ రంగంలో బెంగళూరును హైదరాబాద్ మించి పోయిందన్న కేటీఆర్ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వసతులను కూడా కల్పించేందుకు ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రణాళికలను రచించుకుంటుందని తెలిపారు. హైదరాబాద్ వైపు ప్రపంచం చూస్తుందన్న కేటీఆర్ విశ్వనగరంగా సిటీ మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. భూములు అమ్మగా వచ్చిన డబ్బును ప్రజా ప్రయోజనాలకే వినియోగిస్తామని తెలిపారు.