మోడీ ప్రభుత్వం అధికారం లోకి వాచిన తర్వాత మంత్రివర్గ విస్తరణ మూడుసార్లు మాత్రమే చేసారు. అయితే లోక్ సభతో పాటు నాలుగు ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో మరోసారి కాబినెట్ ను విస్తరించాలన్న యోచనలో ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, చత్తిస్ గడ్, రాజస్థాన్, తెలంగాణ కు సంబంధించిన వారిని కాబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
నాలుగు రాష్ట్రాల…..
ఇప్పటి వరకు మోడీ అదే పంథాను పాటించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన నేతలను కేబినెట్లో కి తీసుకునే అవకాశం ఉందని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో పనితీరు బాగా లేని వారిని పక్కన బెట్టి కొత్త వారికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
వీరికే ఛాన్స్ …
దీంతో ప్రస్తుత మంత్రుల్లో గుండె దడ మొదలయింది. ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిని ఎన్నికల ఈఏడాది కావడంతో పక్కన బెట్టే అవకాశాలున్నాయి. ఈ సారి జరిగే విస్తరణ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఈ రెండు రాష్ట్రాలను బీజీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన నేతలకు ప్రయారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ కు ప్రస్తుతం కిషన్ రెడ్డి ఒక్కరే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. మరొకరిని కాబినెట్ లోకి మోడీ తీసుకుంటారన్న ప్రచారం అయితే బాగానే వినిపిస్తుంది.
రోడ్ మ్యాప్ కోసం….
అందుకోసమే మోడీ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారని చెబుతున్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల తో పాటుగా లోక్ సభ ఎన్నికలకు కూడా రోడ్ మ్యాప్ ను రూపొందించాలని మోడీ సీనియర్ నేతలను కోరినట్లు చెబుతున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో ప్రచారాన్ని ప్రారంభించిన మోడీ మిగిలిన రాష్ట్రాలకు కూడా త్వరలో ప్రచారం నిమిత్తం వెళ్లనున్నారు. ప్రధానంగా ఇందుకోసమే మోడీ ఈ అత్యవసర భేటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు చెందిన వారిని తప్పించే అవకాశం కనిపిస్తుంది.
Follow Us On : YouTube ,Google News