Murder
డబ్బు మనిషిని ఎంత పనైనా చేయిస్తుంది.. హత్యలు చేస్తుంది.. ప్రాణాలు తీయడానికి ఉసిగొల్పుతుంది.. తీసుకున్న డబ్బు చెల్లించలేదని కోపంతో ఇద్దరు వ్యక్తులు ఓ దంపతుల జంటను అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన హైదరాబాద్ ఫిలింనగర్ లో జరిగింది. కేవలం తీసుకున్న అప్పు చెల్లించలేదన్న కోపంతో ఈ జంట హత్యలు జరిగాయి. పూర్తి సినిమా ఫక్కీలో జరిగిన ఈ హత్యలను శోధించడానికి పోలీసులు 200 సీసీ కెమెరాలు పరిశీలించారంటే హత్యలు ఎంత పకడ్బందీగా చేశారో ఊహించుకోవచ్చు.. అత్యంత నాటకీయ ఫక్కీలో జరిగిన ఈ హత్యోదంతం వివరాలు ఇలా ఉన్నాయి..
అప్పు చెల్లించలేదని.. Murder
హైదరాబాద్ కు చెందిన ఓ మహిళను అజ్గర్ పాషా అనే వ్యక్తి పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరు నదీం కాలనీలో నివాసం ఉంటుండగా అజ్గర్ గొర్రెల పెంపకం, విక్రయం చేస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ ద్వారా జుబేర్ ఖాద్రీతో అజ్గర్ కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య స్నేహం పెరిగి, వ్యాపార భాగస్వామ్యానికి నాంది పడింది. జుబేర్ ఫామ్ హౌస్ లో గొర్రెలు, మేకలు పెంచేందుకు అజ్గర్ విడతల వారీగా రూ.20 లక్షలకు పైగా చెల్లించాడు. అయితే, లాభాలు రాకపోవడంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేయాలని అజ్గర్ కోరగా, జుబేర్ దాటవేస్తూ వచ్చాడు. రోజులు గడుస్తున్నాయి కానీ అప్పు తీర్చడం లేదు.. దాంతో జుబేర్ ను హత్య చేయడమే మార్గమని నిర్ణయించుకున్నాడు అజ్గర్, ముంబైలోని తన స్నేహితుడు సల్మాన్ తో మణికొండకు చెందిన సమీర్ సాయంతో జుబేర్ ను నవంబర్ 28న హతమార్చాడు. Murder
వెంట వెంటనే ఇద్దరి హత్య
బిర్యానీ తిందామని చెప్పి జుబేర్ ను ఫామ్ హౌజ్ కు పిలిపించి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ముగ్గురూ కలిసి సమీపంలోని చెరువు పక్కన మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. సత్య కాలనీలోని ఇంట్లో నగదు దాచి ఉండొచ్చనే అనుమానంతో అజ్గర్, అతని స్నేహితులు జుబేర్ ఇంటికి వెళ్లారు. అయితే, వారికి అక్కడ ఏమీ దొరకలేదు. రాత్రి వరకూ ఇంట్లోనే వేచి ఉండగా జుబేర్ భార్య ఫాతిమా అక్కడికి వచ్చింది. దీంతో ఆమెను కూడా గొంతు నులిమి చంపేసి ఫ్యాన్ కు చున్నీతో ఉరేశారు. ఆమె ఒంటిపై ఉన్న 9 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అదే రోజు రాత్రి ఆ ఇంటికి వచ్చిన ఫాతిమా సోదరి, మృతదేహాన్ని చూసి కంగు తింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద ఘటనగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Murder
200 సీసీ కెమెరాలతో పరిశీలన Murder
అనుమానాస్పద ఘటనలుగా నమోదైన ఈ హత్యలు ఎవరు, ఎలా? ఎందుకు చేశారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఫాతిమా మృత దేహాన్ని పరిశీలించిన పోలీసులకు అది హత్యేనని తేల్చారు. మృతురాలి భర్త ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉండడం, అతని హెల్మెట్, ఇతర వస్తువులు లభించగా భర్తే హత్య చేసి పరారైనట్లు తొలుత భావించారు.
ఫాతిమా మృతదేహానికి పోస్టుమార్ట్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు నవంబర్ 29న ఆ ఇంట్లోకి వెళ్లినట్లు గుర్తించారు. వారు ఎవరనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు దాదాపు 200 సీసీ కెమెరాల్లో పరిశీలించారు. ఆ ముగ్గురు అనుమానితుల్లో ఒకరిని మణికొండకు చెందిన సమీర్ గా గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఫాతిమాను చంపింది భర్త కాదని, ముంబైకి చెందిన సల్మాన్ అని గుర్తించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.