13
చెడు వ్యసనాలకు బానిసైన ఓ మైనర్ బాలిక స్నేహితులతో కలిసి తన పెంపుడు తల్లిని హతమార్చిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాలపేటలో సంచలనం రేకెత్తించింది. చిన్నప్పటినుంచి గారాబం చేయడం, మరోవైపు తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబంలో పరిస్థితులు వికటించాయి. అతిగారాంబంగా పెరిగిన కుమార్తె చదువు, సంధ్య లేకుండా వ్యసనాలకు బానిసై ఇంటిని నరకంగా మార్చింది. పుట్టిన రోజు పార్టీ పేరిట లక్షలకు లక్షలు ఖర్చు చేసింది. వద్దని, బుద్ధిగా మసలు కోమని చెప్పిన తల్లి పై ద్వేషం పెంచుకుంది. చిన్న వయసులోనే ప్రేమ వ్యవహారాలు వెలగబెట్టడడమే కాదు.. బాయ్ ఫ్రెండ్స్ తో కలసి జల్సాలకు పాల్పడింది. చివరకు అడ్డు పడుతున్న కన్నతల్లినే కడతేర్చింది. వివరాల్లోకి వెళితే… రాజమండ్రి కంబాలపేటకు చెందిన విశ్రాంతి ఉపాధ్యాయురాలు సిద్ధాబత్తుల మార్గరేట్ జాలియాన 13 ఏళ్ల తన పెంపుడు కుమార్తెతో నివాసం ఉంటోంది. భర్త నాగేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందారు. పెంపుడు కుమార్తెను అతి గారాబంగా పెంచడంతో ఆ బాలిక చెడు వ్యసనాలకు బానిసైంది.
తల్లితో తరచూ గొడవలు… 13
తన పుట్టినరోజు వేడుకలకు లక్షల్లో ఖర్చు చేసిన మార్గరేట్ కుమార్తె 19 ఏళ్ల వయసున్న యువకులతో ప్రేమాయణం నెరపింది.ప్రియుడి స్నేహితులతో కలిసి మద్యం సేవించడం ..జల్సాలు వంటి చెడు వ్యసనాలకు బానిసవ్వడంతో మంద లిస్తున్న తల్లితో తరచూ వాగ్వాదానికి దిగేది. అడ్డుపడుతున్న తల్లిని అడ్డు తొలగించుకోడానికి ప్రియుడు, అతని స్నేహితులతో కలసి ప్లాన్ రెడీ చేసింది., ఈనెల 17వ తేదీన మార్గరేట్ మెట్ల పై నుంచి పడిపోవడంతో ఆమె బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. 18వ తేదీ తెల్లవారుజామున ఆమె అపస్మారక స్థితిలో ఉందంటూ మార్గరేట్ మరిది అంజియాకు బాలిక ఫోన్ చేసి చెప్పింది. ఆయన వచ్చి ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రియుడు, ఫ్రెండ్స్ తో కలసి హత్య
ఈ వ్యవహారంపై అంజియనాకు అనుమానం వచ్చి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. బాలిక చెప్పిన మాటలకు పోస్ట్ మార్టం నివేదికకు పొంతన లేకపోవడంతో ఆ బాలిక కదలికలపై నిఘా పెట్టారు పోలీసులు. ఆ బాలిక అదే ప్రాంతానికి చెందిన గారా ఆకాష్ తో ప్రేమాయణం సాగిస్తోందని తెలుసుకున్నారు. జులియాన మృతి చెందినప్పటినుండి ఆకాష్ తన ఇద్దరు స్నేహితులు కనిపించకపోవడం అనుమానాలకు దారి తీసింది.
దీనిపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టగా, ఈనెల 18వ తేదీన ప్రియుడు ఆకాశ్ తో పాటు అయ్యప్పనగర్ కు చెందిన విపి అక్షయ్ కుమార్, ఆర్యాపురానికి చెందిన ధ్యాసం దినేష్ రాయ్ తో కలిసి బాలిక జులియానా కు ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచి చెప్పిన తల్లిని కడతేర్చిన బాలిక ఇప్పుడు తల్లి, తండ్రి ఇద్దరూ చనిపోవడంతో దిక్కు లేనిది అయ్యింది. యుక్తవయసు పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనించి, సరిచేయకపోతే ఇలాంటి దారుణాలే జరుగుతాయి. 13