యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), దర్శకుడు చందు మొండేటి కలయికలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న సినిమా కు టైటిల్ ఖరారు అయినట్టు సమాచారం. కార్తికేయ -2 లాంటి భారీ విజయం అందుకున్న తర్వాత దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. చందు మొండేటి – నాగ చైతన్య కలయికలో ఇప్పటికే 2 సినిమాలు వచ్చాయి.. వాటిలో మొదటిది మలయాళం రీమేక్ ప్రేమమ్ భారీ విజయం అందుకోగా, రెండవ సినిమా సవ్యసాచి మాత్రం ప్లాప్ అయ్యింది. ఇప్పుడు గీత ఆర్ట్స్ బ్యానర్ పై వీరు చేయబోతున్న ఈ సినిమా వీరి కాంబినేషన్ లో మూడవ సినిమా
అయితే ఇండస్ట్రీ లో ఈ సినిమా టైటిల్ పై రక రకాల ఊహాగానాలు ఉన్నాయి. ఈ సినిమా శ్రీకాకుళం లోని మత్స్యకార ప్రాంతానికి చెందిన కథ అని తెలుస్తుంది. ఈ సినిమా టైటిల్ గా శ్రీకాకుళం ప్రాంతంలోని మత్స్యకారులు తరచుగా వాడే ఒక ఊతపదం ని తీసుకున్నట్టు ఇండస్ట్రీ లో గుస గుసలు వినపడుతున్నాయి. సోషల్ మీడియా లో అయితే ఆ ఊతపదం “తందెలు” అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా టైటిల్ ని చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.