(Crime)
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ ఫుడ్ స్టాల్ ఓనర్ని, సిబ్బంది చంపిన ఘటన శనివారం తెల్లవారుజామున మహారాష్ట్ర నాగ్పూర్లో చోటుచేసుకుంది. దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు వర్కర్లు దాబా యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటు చేసుకుంది. ఈ ఘటన నాగ్పూర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుహి ఫటా సమీపంలోని దాబాలో శనివారం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుడిని మాజీ సర్పంచ్ రాజు థెంగ్రేగా పోలీసులు గుర్తించారు.
ఇటీవల ఒక కాంట్రాక్టర్ ద్వారా ఛోటూ, ఆది అనే ఈ హంతకులు ఒక పనిలో చేరినటు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లోని మండ్లాకి చేందిన ఈ ఇద్దరు బతుకు తెరువకోసం మహరాష్టకి వచ్చారు అని పోలిసులు గుర్తించారు. రాజు ధెంగ్రే అనే వ్యక్తికి ఒక దాబా ఉంది. అది కుహి ఫాటా అనే ప్రదేశంలో నిర్వహించాడు. ఈ వ్యక్తులు ఒక నెల రోజుల క్రితమే లేబర్ కాంట్రాక్టర్ ద్వారా వీరిద్దరినీ రాజు ధెంగ్రే తన ధాబాలో వర్కర్లుగా చేర్చుకున్నాడు. అయితే ఇటీవల యజమానితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో నిందితులిద్దరూ తమకు దీపావళి బోనస్ కావలి అన్ని అడిగారు. అయితే ఆ యజమాని ఇప్పుడు కుదరదని తరువాత ఇస్తానని చెప్పాడు.
నిద్రపోతున్న సమయంలో హత్య…..
ఆ వర్కర్స్ అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో యజమానిని హతమార్చాలని కుట్ర పన్నారు. అదే రోజు రాత్రి భోజనం చేశాక రాజు ధెంగ్రే నిద్రపోతున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఘడమైన నిద్లలో ఉండగా అతని మెడకు తాడును బిగించి తలపై బండరాయితో కొట్టారు. పదునైన ఆయుధంతో దాడి చేశారు. దీంతో అతడి ముఖం ఛిద్రం చేశారు. అనంతరం ధెంగ్రే మృతదేహాన్ని ఓ బొంతలో కప్పి అతని కారులోనే అక్కడ్నుంచి పరారయ్యారు. ధెంగ్రే కుమార్తె తండ్రికి ఫోన్ చేయగా స్పందన రాలేదు. పదేపదే చేసినా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ధాబా సమీపంలోని పాన్ షాప్ యజమానికి ఫోన్ చేసింది. అతను వచ్చి చూడడడంతో హత్య విషయం వెలుగులో వచ్చింది.
హత్య చెసి భావురావ్ కారులోనే పారిపోయారు…..
నాగ్పూర్ ఉమ్రెడ్ రోడ్డులో ఓ దాబా దుకాణం ఇతనికి ఉంది. అక్కడ ఈ ఇద్దరు పనిచేస్తున్నారు. కాగా ఇద్దరు దీపావళికి సొంత ఊళ్లకు వెళ్లాలని భావించారు. ఇంటికి వెళతాము, శాలరీతో పాటు బోనస్ కూడా ఇవ్వాలని ఆ యజమాని అడిగారు. అందుకు ఓనర్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓనర్ పడుకున్న వేళ, అతడిని చంపేశారు. అనంతరం ఆ ఇద్దరు భావురావ్ కారులోనే పారిపోయారు. అయితే, నిందితులకు ఇంకేదైనా రోజు డబ్బులు ఇస్తానని ధెంగ్రే అంగీకరించినట్లు తెలిసింది.
ఆర్థికపరమైన కారణాలవలే హత్య…… (Crime)
కారులో వెళ్లిన నిందితులు విహిర్గావ్ సమీపంలోని నాగ్ పూర్ ఉమ్రెడ్ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టి గాయపడ్డారు. పంచ్ గావ్ నుంచి నాగ్ పూర్ కు వెళ్తున్న కారులో నుంచి ఇద్దరు దుండగులు దిగి దిఘోరి నాకా వైపు పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నామని రాజకీయం ప్రత్యర్థుల కుట్ర కోణం ఏమైనా ఉందా? అని ఆరా తీస్తున్నామని ఎస్పీ హర్ష్ ఎ పొద్దార్ వెల్లడించారు. ప్రాథమికంగా ఆర్థికపరమైన కారణాలేనని తేలిందన్నారు.