మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకష్ మండి పడ్డారు. పెద్దిరెడ్డి పాపాలు పండే రోజు దగ్గరపడిందన్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు దాడులకు బరితెగించాడంటే వైసీపీ ఎంతట అభద్రతాభావంతో ఉందో అర్థమవుతుందని లోకేష్ అన్నారు. వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం రాజారెడ్డి రాజ్యాంగం కాక మరేమిటని లోకేష్ ప్రశ్నించారు.
నేడు పాదయాత్ర…
కాగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు తిరిగి ప్రారంభమయిదంి. ఇప్పటి వరకూ 2,313 కిలోమీటర్ల దూరం నడిచారు. యువగళం పాదయాత్ర 175వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం 8.20 గంటలకు వనికుంట నుంచి బయలుదేరిన లోకేష్ అక్కడి స్థానికులతో సమావేశమయ్యారు. 9.50 గంటలకు ఈపూరులో స్థానికులతో సమస్యలపై చర్చించనున్నారు. అనంతరం కుంచనపల్లిలో ప్రజలతో సమావేశమవుతారు. 12.20 గంటలకు బొమ్మరాజుపల్లిలో స్థానికులతో సమావేశమవుతారు. అక్కడే భోజన విరామానికి ఆగుతారు. సుగాలి సామాజికవర్గీయులతో సమావేశమై చర్చిస్తారు.సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి జయంతిరామపురంలో బస చేయనున్నారు.