తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు నేడు బ్రేక్ పడింది. ఆయన శుక్రవారం న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉండటంతో పాదయాత్రకు విరామమిచ్చి మంగళగిరి కోర్టుకు నారా లోకేష్ వెళ్లారు. ఆయన మంగళగిరి కోర్టులో నేడు వాయిదాకు హాజరై తిరిగి వినుకొండ నియోజకవర్గంలోని వనికుంటకు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రేపటి నుంచి…
రేపటి నుంచి యువగళం పాదయాత్ర యధాతధంగా జరుగుతుందని పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటి వరకూ నారా లోకేష్ 2,315 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారని, లోకేష్ యువగళం యాత్రకు మంచి స్పందన లభిస్తుందని, అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ సాగుతుండటంతో పార్టీ కూడా బలోపేతం అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు