ఫ్రాన్స్ అధ్యక్షుడు సతీమణఇ బ్రిగేట్టే మాక్రాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ చీరను కానుకగా బహుకరించారు. మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. గంధపు పెట్టెలో ఉంచిన పోచంపల్లి చీరను ఆమెకు బహుకరించారు. ఈ చీర ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడించింది. నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి చీరలంటే ఒక ప్రత్యేకం. ఇక్కడి నేత కార్మికులు నేసిన నేత చీరలకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
రంగులు అద్ది…
అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ చీరలను తయారీ చేస్తారు. నేసిన చీరలపై రంగులను అద్దుతారు. ఈ విధానాన్నిరేసిస్ట్ డైయింగ్ అని పిలుస్తారు. దారాలకే రంగులు అద్ది చీరలను నేయడం ఇక్కడి ప్రత్యేకత. గతంలో రాణులు ఈచీరలను అధికంగా వాడేవారు. 1800 కాలం నుంచి ప్రాచుర్యం పొందిన ఈ చీరలంటే మహిళలకు ఎంతో మక్కువ. ప్రస్తుతం ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి చీరను బహుకరించడంతో మరింత ప్రాచుర్యాన్ని పొందింది.