ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు యాత్రలతో బిజీగా ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ యువనేత , మాజీ మంత్రి నారా లోకేష్ యువగలం యాత్ర చేస్తున్నారు. లోకేష్ యాత్ర ఇప్పటికే 2000 కిలో మీటర్లు పూర్తి అయ్యింది. మరో పక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన రెండవ దశ వారాహి యాత్రలో భాగంగా గోదావరి జిల్లాలోని ఏలూరు లో కొనసాగుతూ ఉంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ లు క్షేత్ర స్థాయిలో యాత్రలు చేస్తుంటే ఎక్కడైనా అధికార పక్షం కు ఇబ్బందులు ఎదురు అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం వైస్సార్సీపీ కి ఆ ఇబ్బంది లేనట్టు కనబడుతోంది.
లోకేష్ కి నో కవరేజీ.. పవన్ కు నెగటివ్ కవరేజీ..!
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర ఇవాళ 2000 కిలో మీటర్ ల మైలు రాయిని పూర్తి చేసుకుంది. కానీ యువగలం పాదయాత్ర కు మాత్రం మీడియా లో కవరేజీ లేకుండా పోయింది. దీనికి కారణం ఇప్పుడు మీడియా ఫోకస్ మొత్తం జనసేనాని పవన్ (Pawan Kalyan) చేస్తున్న వారాహి మీదనే ఉండడం. అయితే పవన్ వారాహి యాత్ర ద్వారా వైస్సార్సీపీ కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే పవన్ నోటి దురుసు వ్యాఖ్యలతో జనసేనాని కి నెగటివ్ అయ్యింది. వాలంటీర్లు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్ లు భగ్గు మన్నారు. మీడియా లో కూడా పవన్ చేసిన ఈ వ్యాఖ్యల పై తీవరమైన నెగటివ్ కవరేజీ వచ్చింది. మహిళల అక్రమ రవాణా లో ఆంధ్ర ప్రదేశ్ 11 వ స్తానం లో ఉందని. తప్పిపోయిన మహిళల రికవరీ లో దేశం లోనే రెండవ స్తానం లో ఉందని స్పష్టంగా అధికారిక రికార్డులు తెలుపుతూ ఉంటె.. పవన్ మాత్రం వాలంటీర్ లు మహిళలను అపహరించే దుండగులు లాగ చిత్రీకరించడం పైన సీనియర్ జర్నలిస్టులు తో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పవన్ ను తప్పు బడుతు పవన్ చేసిన వ్యాఖ్యల పై నెగటివ్ కవరేజీ ఇస్తుంది.