బెంగళూరు వేదికగా జరుగుతున్న విపక్షాల సమావేశంలో కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఇండియా గా నామకరణం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఈ పేరు ప్రతిపాదనకు అన్ని పార్టీలూ ఆమోదం తెలిపాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని, మోదీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఐక్యతగా ముందుకు సాగాల్సిన అవసరంపై బెంగళూరు సమావేశంలో చర్చించారు. అయితే యూపీఏ అంటే కాంగ్రెస్ పెత్తనం ఉంటుందని భావిస్తారని పేరు మార్పు చేసినట్లు కనపడుతుంది.
ఇండియా అంటూ…
గతంలో యూపీఏ 1, యూపీఏ 2 గా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు సాగేవి. అయితే అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ పదేళ్ల నుంచి విపక్షంలో ఉన్న కాంగ్రెస్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 26 పార్టీల కు చెందిన నేతలు సమావేశమై కలసికట్టుగా ముందుకు సాగాలంటే ఎన్డీఏకు ధీటైన పేరును ఇండియాగా మార్చారు. ఇందుకోసం పదకొండు మంది సభ్యులతో సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ ఇన్ క్లూజివ్ అలయన్స్ అని ప్రకటించారు.