అన్నవరం ఎగ్జిక్యూటివ్ అధికారి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉచిత భోజనానికి వారికి నో ఎంట్రీ అని చెప్పేశారు. కేవలం భక్తులకు మాత్రమే అన్నవరం సత్యనారాయణ దేవస్థానంలో నిత్యాన్నదానం సత్రంలో భోజనం చేయడానికి అనుమతిస్తానమి ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఆలయ సిబ్బందికి ఎవరికీ ఇక్కడ భోజనాలు చేయడానికి అనుమతి లేదని తెలిపారు.
ఆలయ సిబ్బంది…
అన్నవరం శ్రీ సత్యనారాయణ దేవస్థానంలో నిత్యాన్నదానం జరుగుతుంటుంది. అయితే ఆలయ సిబ్బంది, ఇంజినీరింగ్ ఉద్యోగులతో పాటు షాపుల సిబ్బంది కూడా ఐదు వందల మంది వరకూ నిత్యాన్నదాన భోజనం చేస్తున్నారని, దీంతో భక్తులకు ఇబ్బంది జరుగుతుందని ఆయన తెలిపారు. ఇకపై నిత్యాన్నదాన సత్రంలోకి భక్తులకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. భక్తుల కోసమే దాతలు నిత్యాన్నదానం కోసం నిధులు ఇస్తున్నారని, ఉద్యోగులు కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.