(No Mobiles)
ఏపీలో నాడు, నేడుతో స్కూలు విద్యలో విప్లవం స్రుష్టిస్తున్న జగన్ ప్రభుత్వం టీచర్లు మరింత నాణ్యమైన టీచింగ్ చేసేందుకు వీలుగా స్కూలు టైమ్ లో ఫోన్ వాడకాన్ని నిషేధిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల మొదట్లోనే విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ నేత్రుత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నా.. ఆ నిర్ణయం లాభనష్టాలపై సంబంధిత అధికారులు టీచర్ల యూనియన్లతో, విద్యారంగ ప్రముఖులతో చర్చించి నోట్ రెడీ చేసి తుది ఆదేశాలను రూపొందించారు.
తాజా ఆదేశాల ప్రకారం టీచర్లు క్లాస్ పీరియడ్స్ జరుగుతున్నటైమ్ లో మొబైల్స్ తీసుకెళ్ల కూడదు.యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషనల్ మానిటరింగ్ రిపోర్ట్2023 ప్రకారం క్లాస్ రూమ్ లో టీచర్ మొబైల్ ను వినియోగిస్తే పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుందని,టీచర్ ఫోన్ వాడకపోయినా పిల్లల దగ్గర ఉన్న టైమ్ లో మొబైల్ ఉంటే వారికి చదువుపై ద్రుష్టి కుదరదని తేల్చి చెప్పింది. ఈనివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన జగన్ ప్రభుత్వం ఇకపై క్లాస్ రూముల్లో టీచర్లు మొబైల్స్ తీసుకెళ్లరాదని ఆదేశించింది.
మొబైల్ ఫోన్ పై కఠినమైన నిబంధనలు (No Mobiles)
ఇప్పటికే చాలామంది టీచర్లు క్లాస్ రూమ్స్ కి ఫోన్లు తీసుకెళ్లి వారి వ్యక్తిగత పనులు చేసుకుంటున్నారని, దీనివల్ల పిల్లల టీచింగ్ కు ఇది ఏ మాత్రం ఉపకరించదని ప్రభుత్వం పేర్కొంది.అందువల్ల టీచర్లు క్లాస్ రూమ్ లోకి వెళ్లేముందు ఫోన్ ను సైలెంట్ లో పెట్టేసి హెడ్ మాస్టర్ ముందు డిపాజిట్ చేసి ఆ తర్వాతే క్లాస్ లోకి వెళ్లాలి. ఈ నిబంధనను ఉల్లంఘించే టీచర్లకు పనిష్మెంట్లు కూడా ఉంటాయి.
ఎవరైనా టీచర్ మొబైల్ ను క్లాస్ రూమ్ కి తీసుకెళితే తొలి తప్పిదంగా వారి మొబైల్ ను హెడ్ మాస్టర్/ సెక్షన్ ఆఫీసర్ సీజ్ చేసి ఆరోజు అంతా మెయిన్ ఆఫీస్ లో ఉంచాలి. ఫోన్ ను తిరిగి తీసుకునే ముందు టీచర్ ఇకపై ఆ తప్పు చేయనని ఒకనోట్ రాసి ఇవ్వాలి.అదే రెండోసారి ఇలా తప్పుచేసి ఏ టీచర్ అయినా దొరికిపోతే వారి ఫోన్ ను స్వాధీనం చేసుకుని మెయిన్ ఆఫీస్ లో ఉంచాలి. (No Mobiles)
స్కూలు సమయం పూర్తయ్యాక మండల విద్యాధికారిని కలసి మొబైల్ ఫోన్ పాలసీని టీచర్ ఉల్లంఘిస్తున్న విషయాన్ని వారి ద్రుష్టికి తేవాలి. మండల విద్యాధికారి హెచ్చరిక తర్వాత మాత్రమే మొబైల్ ను తిరిగి టీచర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
మూడోసారి ఉల్లంఘిస్తే సర్వీస్ పై మార్క్
ఇక ఎవరైనా టీచర్ మూడోసారి ఈ తప్పుకు పాల్పడితే మాత్రం ఈసారి పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది. ఫోన్ ను స్వాధీనం చేసుకుని జిల్లా విద్యాధికారికి పంపుతారు. ఈ ఉల్లంఘన ను వారి సర్వీస్ బుక్ లో నోట్ చేసిన తర్వాత డీఈవో తో మాట్లాడిన తర్వాతే ఫోన్ ను తిరిగి ఇస్తారు.
సూళ్లలో హెడ్ మాస్టర్లు ఇకపై మరింత అప్రమత్తంగా, కఠినంగా వ్యవహరించాలని, రూల్స్ ను ఉల్లంఘించే వారి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. టీచర్ల ప్రవర్తనను తనిఖీ అధికారులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని స్పష్టం చేసింది. తనిఖీ అధికారులు హటాత్తుగా స్కూలును సందర్శించినా, రొటీన్ లో భాగంగా సందర్శించినా ఉల్లంఘనలు కనిపిస్తే హెడ్ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటారు.
అలాగే విద్యార్ధుల నుంచి, ప్రజలనుంచి ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు అందినా కూడా హెడ్ మాస్టర్, టీచర్లపై చర్యలు తప్పవు.ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఆదేశాలపై టీచర్లకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు తూచా తప్పకుండా పాటించేలా చూడాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. అత్యున్నత సాంకేతిక టెక్నాలజీతో కూడిన విద్య పిల్లలకు అందాలి..అదే టైమ్ లో వారిలో వికాసం పెరిగేందుకు సహకరించాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ఆదేశించిన కేంద్రం
మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా క్లాస్ రూమ్స్ లోమొబైల్ ఫోన్స్ వినియోగాన్ని పబ్లిక్,ప్రైవేట్ స్కూళ్లలో నిషేధిస్తూ ఆగస్టు10 నే ఆదేశాలు జారీ చేసింది.క్లాస్ రూమ్స్, ప్లే గ్రౌండ్స్, లేబరేటరీలు, లైబ్రరీలలో టీచర్లు ఫోన్లు తీసుకెళ్లరాదని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి.