ODI
వాల్డ్ కప్ లో భారత బ్యాటర్లు, బౌలర్లు రాణించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకుపోతోంది టీమిండియా. ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది.ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో శుభ్మన్ గిల్ నంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్ను కిందకు దించాడు భారత యువకెరటం. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో గిల్ అగ్రస్థానానికి ఎగబాకి, బాబర్ను రెండో ప్లేస్కు నెట్టెశాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వాల్డ్ కప్లో 6 ఇన్నింగ్స్ ల్లో రెండు అర్ధసెంచరీల సాయంతో 219 పరుగులు చేశాడు గిల్.. బాబర్ కంటే ఆరు రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం గిల్ 830 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతని తర్వాత బాబర్ ఆజమ్ 824 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 830 అధికంగా సాధించి, ఐసీసీ ర్యాంకింగ్స్ లో తొలిసారి అగ్రపీఠాన్ని దకిచుకున్నాడు. సచిన్, ధోని, కోహ్లి తర్వాత వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ర్యాంక్కు చేరిన భారత బ్యాటర్ గిల్ కావడం విశేషం.
వాల్డ్ కప్ లో చెలరేగుతున్న సిరాజ్ ODI
మరోవైపు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తన బౌలింగ్తో నిప్పులు చెరుగుతున్నాడు. కన్సిస్టింగ్గా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధుల గుండెల్లో భయం పుట్టిస్తున్నాడు. వరల్డ్కప్లో మొదటి మ్యాచ్లలో సిరాజ్ పెద్దగా ప్రబావం చూపించలేకపోయాడు. కానీ నెమ్మదిగా తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. శ్రీలంక మీద అతని ప్రదర్శన అయితే టాప్ క్లాస్ గా నిలుస్తుంది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ODI జాబితాలో అగ్రస్థానాన్ని తిరిగి పొందాడు. ఇప్పుడు 709 పాయింట్లతో మరోసారి ప్రపంచ నం. 1 అయ్యాడు. 694 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆటగాడు కేశవ్ మహరాజ్ కంటే సిరాజ్ ముందున్నాడు. నిజానికి, వన్డే క్రికెట్లో, భారత్కి ఇప్పుడు టాప్ 10 ర్యాంకింగ్స్ లో నలుగురు బౌలర్లు ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం సిరాజ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ మినహా టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నారు.
సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యం
శుభ్మాన్ ODIలలో నంబర్ 1 ర్యాంక్ను సాధించగా, సూర్యకుమార్ యాదవ్ తన పేరుకు తగ్గటు 863 పాయింట్లతో T20 చార్ట్ లలో ఆధిపత్యం చెలాయించాడు. మహ్మద్ రిజ్వాన్ 787 పాయింట్లు కంటే దాదాపు 100 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నాడు. టాప్ 10 బ్యాటర్లలో రోహిత్ శర్మ పదో స్థానంలో ఉండగా బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ ప్రథమ స్థానంలో, రవీంద్ర జడేజా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో జడ్డూ నెంబర్ వన్ స్థానంలో ఉండగా రెండో స్థానంలో అశ్విన్, ఐదో స్థానంలో అక్షర్ పటేల్ ఉన్నారు. ఇక టీమిండియా మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ యాదవ్ టాప్లో ఉంటే, టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ నంబర్ వన్గా ఉన్నాడు. అలాగే టెస్ట్ ఆల్రౌండర్ల ర్యాకింగ్స్లో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కనొసాగుతున్నాడు. మొత్తానికి ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా చరిత్ర సృష్టించారు.