తెలంగాణలో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కోకాపేట నియో పోలీస్ భూమిని అధికారులు వేలం వేయగా అత్యధిక ధరలు పలికాయి. ప్లాట్ నెంబరు 10కి ఎకరాకు వంద కోట్ల రూపాయల ధర పలకడం విశేషం. హెచ్ఎండీఏ అధికారులు హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో ఉన్న భూములకు ఈ ఆక్షన్ ను విధించారు. ప్లాట్ నెంబరు 10లో 3.6 ఎకరాల భూమిని ఆక్షన్ వేశారు. ఈ ఆక్షన్ తో ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తుంది.
ఈ ఆక్షన్ లో…
గతంలో కంటే భూములు అత్యధిక ధరకు అమ్ముడు పోతుండటం విశేషం. రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుగోలు చేస్తుండటం వల్లనే ధరలు ఆకాశానికి కంటాయి. ప్లాట్ నెంబరు 7లో ఎకరం భూమి 75 కోట్లు దాటింది. అలాగే ప్లాట్ నెంబరు 6లో ఎకరం భూమి 70.75 కోట్ల రూాపయలు పలికింది. ప్లాట్ నెంబరు 8లో ఎకరం భూమి 63.25 కోట్లు రూపాయల పలికినట్లు అధికారులు వెల్లడించారు.