Mind
మనలో ఉండే సకల రోగాలకు మన జీవన శైలే కారణమంటున్నారు సైంటిస్టులు. మనిషి నడక, నడతలో ఉండే లోపాల వల్లనే రకరకాల సమస్యలు , జబ్బులు వస్తున్నాయని, వాటిని మార్చుకుంటే అసలు రోగాలే రావనీ వారంటున్నారు. అన్నింటికీ మూలకారణమైన మనసు, ఆలోచనలు, ప్రవర్తన, నడవడికలను సరిదిద్దుకుంటే వంద శాతం రోగాలకు దూరంగా ఉండవచ్చునట.. వారి పరిశోధనల ప్రకారం ఎన్నో వింతైన అంశాలు వెలుగు లోకి వచ్చాయి. ఇంత కాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవని, మనం జీవించే విధానం లోనే ఉన్నాయని మనస్సును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని డాక్టర్లు తేల్చిచెబుతున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్నవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు. మనస్సులో లేని పోని ఆలోచనలు చోటు చేసుకుని వాటి నుంచి బైటపడడానికి బలహీనతలు పెంచుకోవడం, వాటికి బానిసలై దురలవాట్ల పాలై పోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, జీవన శైలిని సరిదిద్దే పనిలో పడ్డారు. అందుకే డయాబిటిక్, బిపి వంటి అనారోగ్య అంశాలకు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు. ఇది వరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తినమంటున్నారు.
మనసుకి నచ్చినది చేయండి (Mind)
పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు. ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే మరి కొందరు జిమ్కు వెళ్ళాలనుకుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచి పెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు. ఒక్కసారిగా వీరి వైఖరి ఇలా మారిపోడానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగు చూస్తున్న అంశాలే కారణం.
గ్యాస్ ట్రబుల్ కి మానసిక ఒత్తిడే కారణం… (Mind)
మనల్ని రోజూ వేధించే గ్యాస్ ట్రబుల్ కి కారణం మనం తిన్న, తింటున్న ఆహారం కానే కాదుట. మానసిక ఒత్తిడి వల్లనే గ్యాస్ట్ర బుల్ తలెత్తుతుందని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆవేశం వల్లే అధిక రక్తపోటు ఉప్పు ఎక్కువగా తినే వారి కంటే ఆవేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే అధిక రక్తపోటు ఎక్కువట. అతి బద్ధకం వల్ల చెడు కోలెస్టరాల్ కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కోలెస్టరాల్ ఎక్కువట. మధుమేహం సమస్య తీపి పదార్థాలు అధికంగా తినే వారిలో కంటే, అధికస్వార్ధం, మొండితనం ఉన్నవారి లోనే మధుమేహం సమస్యలు ఎక్కువట . అతివిచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్త్మా వస్తుందట. ప్రశాంతత లేక గుండె జబ్బులు రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు.
అన్ని సమస్యలకు మూలం జీవన శైలే
మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్లకాదని లైఫ్ స్టయిల్సం బంధమైన వేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం50% ఆధ్యాత్మికత లోపంవల్ల, 25% మానసిక కారణాల వల్ల, 15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వల్ల10% శారీరక కారణాల వల్ల రోగాలు వస్తున్నాయి. అందువల్ల కడుపు మాడ్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా, జీవన శైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి. త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, సంతోషం , సానుకుల దృక్పథం పెంచుకోవాలి. అప్పుడే ఎలాంటి రోగాలు లేకుండానూటికి నూరు పాళ్లు ఆరోగ్యంగా ఉంటారట.