పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వర్షాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. అధికార పక్షాన్నిఇరుకున పెట్టేందుకు విపక్షం, విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టేందుకు అధికార పక్షం సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రజలకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను లేవనెత్తి అధికారంలో ఉన్న బీజేపీని ఇబ్బంది పెట్టాలన్నది కాంగ్రెస్ పక్షాల ఆలోచనగా ఉంది. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
అధికార, విపక్షాలు…
ప్రధానంగా కామన్ సివిల్ కోడ్ బిల్లు ఈ సమావేశాల్లో తెస్తారన్న ప్రచారంతో విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఉభయ సభలను స్థంభిప చేయాలన్న ప్రయత్నంలో ఉన్నాయి. సభ లోపల, బయట తమ ఆందోళనలను తెలియచేయాలని నిర్ణయించాయి. అలాగే ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డినెన్స్ కూడా ఈ సమావేశాల్లో రానుండటంతో విపక్షాలన్నీ కలసి మూకుమ్మడిగా ఎదుర్కొనాలని నిర్ణయించాయి. అయితే అంతే ధీటుగా విపక్షాలను కట్టడి చేసి, బిల్లుల ఆమోదం పొందేలా చూసేందుకు అధికార పక్షం రెడీ అవుతుంది. మణిపూర్ అంశం కూడా ఈసారి ఉభయ సభల్లో కాక రేపనుంది. దీనిపై హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చే అవకాశముంది.