పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (PAWAN) ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోనున్నారా..? అందుకు అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. జనసేనాని ఇప్పటికే రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. తాజాగా పవర్ స్టార్ తన మూడు భార్య అన్నా లెజ్నెవాతోనూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్టు, వీరిద్దరూ మ్యూచ్యువల్ గా డైవొర్స్ కు అప్లై చేయనున్నట్లు సోషల్ మీడియాలో గుస గుసలు వినపడుతున్నాయి.
ప్రేమ.. పెళ్లి..
తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ పవన్ – అన్నా లేజనోవా జంట, డిసెంబర్ 2013 లో కేవలం కొద్ది మంది మిత్రుల సమక్షంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పవన్ – అన్నా దంపతులకు ఇద్దురు పిల్లలు ఉన్నారు. వీరిలో మొదటి సంతానం పాప పొలెనా అంజనా పవనోవా అయితే రెండవ సంతానం బాబు మార్క్ శంకర్ పవనోవిక్. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు తల్లి దగ్గరే ఉన్నారని తెలుస్తోంది.
మెగా ఫామిలీ కి దూరంగా..!
సోషల్ మీడియా లో వినిపిస్తున్న గాసిప్స్ కు బలం చేకూర్చే విధంగా ఈ మధ్యకాలంలో అన్నా మెగా ఫ్యామిలీలో జరిగిన ఏ కార్యక్రమానికీ హాజరు కాకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన వరుణ్, లావణ్యా త్రిపాఠీల నిశ్చితార్ధానికి సైతం అన్నా హాజరవ్వలేదు. దాదాపు పది ఏళ్ళ వారి దాంపత్య జీవితంలో మొదటిసారిగా ఎందుకు ఒడిదుడుకులు ఎదురయ్యాయని పవన్ అభిమానులు బాధపడుతున్నారు. ఈ వార్తలను అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు జనసేన పార్టీ కానీ ఇంతవరకు ఖండించకపోవడంతో ఈ వార్తలో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుందని సోషల్ మీడియా లో టాక్ నడుస్తోంది.
Follow Us On : YouTube , Google News