జనసేనా అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర శుక్రవారం ఏలూరు జిల్లా తణుకు చేరుకుంది. తణుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఆయన ప్రసంగం లో మొత్తంగా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయారు. 4 ఏళ్ళ సీఎం జగన్ పరిపాలన పై విమర్శనాస్త్రాలను సంధించారు జనసేనాని పవన్.
మందు బాబుల కడుపులు కొట్టావ్ జగన్..!
పవన్ తన ప్రసంగం ఆద్యంతం సీఎం జగన్ ని ఏకవచనం తో సంబోదిస్తూనే ప్రసంగించారు. ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం షాప్ లలో ఇప్పటివరకు డిజిటల్ ప్రెమెంట్స్ ను అంగీకరించకపోవడం పై భగ్గుమన్నారు. అలాగే 60 రూపాయలు కు అమ్మాల్సిన మద్యాన్ని 160 రూపాయలకు అమ్మడం ద్వారా సీఎం జగన్ రాష్ట్రంలోని మందుబాబుల కడుపులు కొడుతున్నాడ్డని పవన్ ధ్వజమెత్తారు.
అయితే వైసీపీ నాయకులూ మాత్రం పవన్ వ్యాఖ్యలను ఖండించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మద్యం కొనాలంటే షాక్ కొట్టేలా వాటి ధరలను పెంచుతామని స్పష్టం చేసారని తెలిపారు. మద్యాన్ని కూడా దశలవారీగా నిషేధిస్తామని, చివరిగా ఆంధ్ర లో మద్యం కేవలం 5 స్టార్ హోటల్ లలో మాత్రమే అందుబాటులో ఉండేలా చూస్తామని సీఎం జగన్ తెలిపిన మాటలను వైసీపీ నాయకులు పవన్ కు గుర్తు చేసారు.