పుంగనూరు ఘర్షణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబును ఈ ఘర్షణకు సంబంధించి మొదటి ముద్దాయిగా చేర్చాలని పెద్దిరెడ్డి కోరారు. పుంగనూరులో కావాలని గొడవలు సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నించారన్నారు. రాళ్లు, బీరుబాటిళ్లను తీసుకు వచ్చి పోలీసులపై రాళ్ల దాడి చేసింది ఎవరని పెద్ది రెడ్డి ప్రశ్నించారు.
పక్కా ప్లాన్ తో…
రౌడీలు, అల్లరిమూకలను ప్రోత్సహించి చంద్రబాబు ఘర్షణలకు కారణమయ్యారన్నారు. టీడీపీ కార్యకర్తల రాళ్లదాడిలో ఎందరో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వాస్తవానికి పుంగనూరులో చంద్రబాబు కార్యక్రమం లేదని, పుంగనూరు హైవే నుంచి చిత్తూరు వెళ్లాల్సి ఉందని, కావాలనే ఆయన రూటు మార్చి గొడవలకు కారణమయ్యారన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే పుంగనూరులో ఘర్షణలు జరిగాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.