pk
ఓ వైపు రాజకీయాలు,మరోవైపు సినిమాలు.. ఏపీలో ఇంత బిజీయస్ట్ లీడర్ కమ్ యాక్టర్ ఎవరూ లేరని చెప్పొచ్చు.. మొన్నటికి మొన్న వారాహి యాత్ర చేస్తూనే షూటింగ్ చేసి సినిమా రిలీజ్ అయ్యేలా చేసిన జనసేనాని పవన్ కల్యాణ్ బ్రో సినిమాతో అభిమానులకు పండగ చేశారు. ఇప్పుడు మరో మూవీ సెట్స్ మీదకు వస్తోంది. అదే ఉస్తాద్ భగత్ సింగ్.. డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొననున్నారు పవన్. హీరోయిన్ శ్రీలీల తో పాటు, కీలక నటీనటులు ఇందులో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కూడా రీమేక్ సినిమానే అనే విషయం అందరికి తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేశారు హరీశ్ శంకర్. ఆ షెడ్యూల్ లో తీసిన సన్నివేశాలతో నే గ్లింప్స్ కట్ చేసి రిలీజ్ చేశారు. అప్పట్లో అదంతా ఓ ఫెస్టివల్ గా నడిచింది. ఇప్పుడు మరో షెడ్యూల్ కు రెడీ అవుతున్నారు హారిశ్ శంకర్.
పవన్, సాయి కాంబో కోసం వెయిటింగ్.. pk
ఈ షెడ్యూల్ కోసం ఆనంద్ సాయి భారీ సెట్ నిర్మించారు.ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయితో పవన్ కల్యాణ్ కు ఉన్న పర్సనల్ రిలేషన్ వల్లే ఇది సాధ్యపడింది.ఆ సెట్ లో నే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. పవన్ , సాయిల కాంబినేషన్ లో తయారయ్యే సెకండ్ సెట్ షూటింగ్ రషెస్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ సారి కూడా మరో గ్లింప్స్ ప్లాన్ చేయమంటూ డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ షూటింగ్ కొంచెం ఎక్కువ టైమే తీసుకునేలా ఉంది. అయితే ఎన్ని రోజులు అనే విషయాన్ని బయటపెట్టలేదు. తాజా సమాచారం ప్రకారం 2 వారాలు పాటు ఇది జరుగుతుంది.
ఓజీ
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నమరో సినిమా ఓజీ. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం లో డీవీవీ దానయ్య దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ముంబయిలో లోకల్ గా కొంత ఫినిష్ అయింది. కొంత పార్ట్ ను పవన్ వుండగా, మరికొంత పార్ట్ లేకుండా షూట్ చేశారు. ఇదిలా వుంటే ఈ సినిమాకు అక్టోబర్ 22న పవన్ డేట్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నవంబర్ లో కూడా కొన్ని రోజులు కేటాయిచ్చినట్లు తెలుస్తోంది. అక్టోబర్ షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తున్నారు. 20 రోజులు నిరాటంగా షూట్ చేస్తే సినిమా చాలా వరకు ఓ కొలిక్కి వచ్చేస్తుంది. ఓజీ డిసెంబర్ లో నే థియేటర్లలో విడుదల చేయనున్నారు. మరోవైపు సంక్రాతి సినిమాల బరిలో ఏ సినిమాలు ఉండబోతున్నాయన్నది సస్పెన్స్ గా మారింది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి వస్తుందనే అంచనాలున్నాయి. ఒకవేళ ఆ సినిమా పూర్తికాకపోతే ఓజీ సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో నిర్మాత దానయ్య ఉన్నారు. ఓజీ సినిమా కనుక సంక్రాంతికి వస్తే పవన్ ఫ్యాన్స్ హడావుడి కెవ్వు కేకే..