సీఎం జగన్ – పెన్నా సిమెంట్స్ (Jagan) క్విడ్ ప్రో కో (Quid Pro Quo) ఆస్తుల జప్తు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు (Enforcement Directorate) సిబిఐ స్పెషల్ కోర్ట్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూ ఢిల్లీ లోని మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) యొక్క అప్పీలేట్ ట్రిబ్యునల్ లో జగన్ – పెన్నా సిమెంట్స్ కేసుకు సంబందించిన వాదనలు జరిగాయి.
ఈడి వాదన ఊహకు అందనిది.. అది ఎలా సాధ్యం అన్న కోర్ట్..
ఈ సందర్భంగా కోర్టు పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది. ” ఈడి వాదన ఊహకు అందనిది, అసలు అది ఎలా సాధ్యం..? , ఈ కేసులో జరిగిన వ్యాపార పెట్టుబడులు అన్ని చట్టానికి లోబడే జరిగాయని దానికి అనుగుణంగానే సాక్షి పత్రిక (Jagan) స్థాపించిన కొద్దీ సంవత్సరాలలోనే తెలుగు పత్రికల సర్క్యూలేషన్ లో నెంబర్ 2 స్థానం దక్కించుకుందని కోర్ట్ అభిప్రాయ పడింది.
కోటి లాభానికి 45 కోట్ల పెట్టుబడులా..!
జగన్ – పెన్నా సిమెంట్స్ కేసులో ఈడి ఆరోపణల పైన కూడా కోర్ట్ విస్మయం వ్యక్తం చేసింది. జగన్ ద్వారా కేవలం 1.1 కోట్ల లాభ పడి తిరిగి ఆయన సంస్థల్లో (Sakshi Media) దాదాపు 45 కోట్లు పెన్నా సిమెంట్స్ ఎలా పెట్టుబడి పెట్టిందనేది ఊహకు అందడం లేదు అని ఈడి కు కోర్ట్ తెలిపింది. ఈ కారణంగా అనంతపూర్ జిల్లా యాడికి మండలంలోని కమలాపాడు లో పెన్నా సిమెంట్స్ కి సంబందించిన 231 ఎకరాలను ఈడి జప్తు నుంచి విడుదల చేస్తునట్టు కోర్ట్ తెలిపింది.
Follow Us On : YouTube , Google News