ఎక్క్డడైనా దొంగతనం చేసిన వారిని శిక్షిస్తారు. కోర్టులో హాజరు పరుస్తారు. వారికి శిక్ష పడేంత వరకూ లాకప్ లో ఉంచుతారు. సాధారణంగా ఏ పోలీసులయినా అలాగే చేస్తారు. కానీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు మాత్రం వెరైటీగా ఆలోచించారు. నిందితుడితో పాటు బాధితుడిని కూడా లాకప్ లో వేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కోళ్ల దొంగతనాలు…
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. తమ కోళ్లను దొంగతనానికి గురవుతున్నాయంటూ గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు కోళ్ల దొంగను పట్టుకోలేదు. కానీ కరువెన గ్రామానికి చెందిన ఒక యువకుడు కోడిని దొంగిలిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు.
రెండు రోజుల నుంచి…
పోలీసులు నిందితుడితో పాటు కోడిని కూడా లాకప్ లో వేశారు. రెండు రోజుల నుంచి కోడికి ఆహారం అందిస్తూ దానిని లాకప్ లో ఉంచడం చర్చగా మారింది. కోర్టులో ప్రవేశపెట్టి ఆ కోడిని యాజమానికి అప్పగించాలని, బయట ఉంచితే పారిపోతుందని భావించి లాకప్ లో ఉంచామని పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.