ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్ 5 జోన్ లో పేదళ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. లబ్దిదారులకు గతంలో ఇళ్లపట్టాలను అంద చేసిన సంగతి తెలిసిందే. ఆర్ 5 జోన్ లో 50,793 మంది లబ్దిదారులకు గతంలో జారీ చేసిన స్థలంలో ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు అందడంతో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు.
మౌలిక సదుపాయాలకు…
ఈ ఇళ్ల నిర్మాణానికి 1,829 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. లే అవుట్ లు వేసిన ఈ ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించనుంది. రోడ్లు, మంచినీరు, విద్యుత్తు సౌకర్యం వంటివి కల్పించనున్నారు. గుంటూరు జిల్లా వెంకటాయపాలెంలో జరగనున్న బహిరంగ సభలో జగన్ ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. ఇందుకోసం లబ్దిదారులు తమ కుటుంబ సభ్యులతో కలసి హాజరవుతున్నారు.