పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు. అసలు ప్రభాస్ విదేశాలకు ఎందుకువెళ్లాడు? ఈ ప్రశ్న ఆయన ఫ్యాన్స్ లో చాలామందిని వేధిస్తోంది. ఎంతోకాలంగా ప్రభాస్ మోకాలి నోప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ డేట్ తో బిజీగా ఉండే ప్రభాస్ ప్రస్తుతం నోప్పి తో మూవీస్ ను తగ్గించాడు. ఆఫర్స్ ఉన్నా షూటింగ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.
బాహుబలి నుంచీ నొప్పి ఉందా? ప్రభాస్
మోకాలి నొప్పి రావటానికి కారణం బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చేయడంతో ప్రభాస్ కు మోకాలి నొప్పి సమస్య వచ్చింది. అప్పటి నుంచి మోకాలి సమస్యతో సతమతమౌతున్నాడు. తాత్కాలిక చికిత్స తీసుకొని ఆదిపురుష్, సలార్, రాధేశ్యామ్ సినిమా షూటింగ్ లను చేశాడు.
యూరప్ లో సర్జరీ?
అయితే తనను వెంటాడుతున్న మోకాలి నొప్పి నుంచి కోలుకోడానికి డార్లింగ్ ప్రస్తుతం యూరప్ కి వెళ్లాడు. రెండు రోజుల క్రితమే సర్జరీ విజయవంతంగా పూర్తయ్యిందని తెలుస్తోంది. చికిత్స జరగటంతో యూరప్ లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు ఈ రెబల్ స్టార్. ఈ నెల మొత్తం రెస్ట్ తీసుకోబోతున్నట్లు.. తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మేకర్స్ ద్వారా తెలుసుకుంటున్నట్లు సమాచారం.. నవంబర్ లో రెబల్ స్టార్ ఇండియాకు రానున్నారని అంచనాలు వేస్తున్నారు. నవంబర్ నుంచి ఇంక షూటింగ్ లో పాల్గొంటారట డార్లింగ్.
సలార్ మూవీ ప్రభాస్
అన్నీ అనుకున్నవి అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈ పాటికి తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్లలో సలార్ మూవీ హడావిడి చేస్తూ ఉండేది. సలార్ సినిమాపైనే ఎన్నో అశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కి చివరకు పోస్ట్ పోన్ తో నిరాశ కలిగించారు మేకర్స్. సినిమా పోస్ట్ పోన్ వార్తతో ఫ్యాన్స్ నెగెటివ్ ఆలోచనలు చేయటం మొదలు పెట్టారు. ప్రభాస్ గత మూడు చిత్రాలు లాగానే ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందా అంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. గతంలో సలార్ సినిమాలో VFX పనులు పూర్తిచేయలేదనే కారణం తో పోస్ట్ పోన్ మెంట్ జరిగిందని మేకర్స్ తెలిపారు.
సలార్ మూవీ క్లైమాక్స్ సీన్స్ రీ షూటింగ్
సలార్ మూవీ పై ఇప్పుడు హడావిడి చేస్తున్న ఒక షాకింగ్ రూమర్ ఫిలిమ్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తల ప్రకారం ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను
ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ ను రీ షూటింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ముందు తీసిన క్లైమాక్స్ మొదటి కాపీ చూస్తున్న సమయంలో ప్రశాంత్ నీల్ కు నచ్చలేదట.దాంతో మళ్లీ రీ షూటింగ్ చేద్దాం ఆలస్యం అయినా పర్వాలేదు ఔట్ పుట్ ముఖ్యం అంటూ వాయిదా వేసాడట నీల్. కేవలం క్లైమాక్స్ సన్నివేశం మాత్రమే కాదు, సలార్ పార్ట్ 2కి సంబంధించి కొన్ని లీడింగ్ సన్నివేశాలు కూడా చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. మిగతా సినిమా విషయంలో అసలు కంగారు పడాల్సిన అవసరం లేదని నీల్ అన్నారట. కచ్ఛితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని ప్రభాస్ సన్నిహితులు అంటున్నారు. డిసెంబర్ 22న సలార్ థియేటర్ లో రిలీజ్ కు రెడిగా ఉంటుందని సమాచారం.. కానీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది లేదు.