ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ కు చేరుకున్నారు. వారణాసి నుంచి హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్ లో వరంగల్ కు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం వరంగల్ భద్రకాళి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. దేవాలయంలోకి ఆలయ అధికారులు ఎవరినీ అనుమతించలేదు. ఆలయాన్ని ముస్తాబు చేసిన అధికారులు ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
పర్యటనను నిరసిస్తూ…
అయితే ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. అవి కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ, వరంగల్ జాతీయ రహదారిపైన కూడా ఈ పోస్టర్లు వెలిశాయి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటూ పోస్టర్లలో ప్రశ్నించారు. దీంతో బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోదీకి వ్యతిరేకంగా వేసిన పోస్టర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ మరికాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Follow Us On : YouTube , Google News