ప్రధాని నరేంద్ర మోదీ నేడు దక్షిణాది పార్లమెంటు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయ సభల్లో విపక్షాలను ఎలా ఎదుర్కొనాలన్న దానిపై ప్రధాని మోదీ దక్షిణాది పార్లమెంటు సభ్యులకు వివరించనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయిన తర్వాత మణిపూర్ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతుండటతో సభలు వరసగా వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.
సభలో వ్యవహరించాల్సిన…
అయితే మణిపూర్ అంశంపై విపక్షాల వాదనను ధీటుగా తిప్పికొట్టేందుకు అధికార పార్టీ కూడా సిద్ధమయింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ పార్లమెంటు సభ్యులతో సమావేశమవుతున్నారు. సభలో విపక్షాలకు ఎలా సమాధానం చెప్పాలన్న దానిపై మోదీ క్లాస్ పీకనున్నారు. ఈనెల 8వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వంపై అవిశాస్వం విషయంలో లోక్ సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మోదీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.