ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కల ప్రభుత్వంలో విలీనం కావడం. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆర్థికపరమైన బిల్లు కావడంతో ఆమోదం కోసం గవర్నర్ వద్దకు ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం పంపింది.
ఈ సమావేశాల్లో…
కానీ రాజ్భవన్ నుంచి ఇంకా బిల్లు ఆమోదం పొందినట్లు తెలియరాలేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులు మాత్రమే కొనసాగించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈనేపథ్యంలో ఆర్టీసీ బిల్లు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందుతుందా? లేదా? అన్న టెన్షన్ అటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఇటు ఆర్టీసీ కార్మికుల్లోనూ నెలకొంది.