ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న బిల్లును రాజ్భవన్ లో తొక్కి పెట్టినందుకు నిరసనగా నేడు ఆర్టీసీ కార్మికులు బంద్ను పాటిస్తున్నారు. పరిశీలన కోసం గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ బిల్లును ఆపడాన్ని కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల వరకూ బస్సులను బంద్ చేసి తమ నిరసనను తెలియజేశాయి. అన్ని డిపోల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసనను తెలియజేశారు.
బిల్లు ఆమోదం…
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తూ ఉద్దేశించి బిల్లును రాజ్భవన్ కు పంపింది. అయితే ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ సాంకేతిక నిపుణుల సలహాను తీసుకున్న తర్వాతనే బిల్లును ఆమోదించి అసెంబ్లీకి పంపనుంది. మరోవైపు అసెంబ్లీ మూడు రోజులు పాటు కొనసాగించాలని బీఏసీ నిర్ణయించడంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ సంఘనేతలు ఆరోపిస్తున్నారు. బిల్లును ఆమోదించక పోతే రాజ్భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.