Love story
భానుమతి సింగిల్ పీస్ అంటూ తెలుగు కుర్రాళ్ల మనసులు దోచేసిన గ్లామర్ బ్యూటీ సాయి పల్లవి. మొదటి సినిమా అయినా ఫిదా లో తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తన నటనతో, డాన్స్ తో ఎంతగానో క్రేజ్ సంపాధించింది ఈ నాచురల్ బ్యూటీ. లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ , మలయాళ భాషల్లోనూ నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. సౌందర్య తరువాత అంతటి పేరు తెచ్చుకున్నఈ హీరోయిన్ ఎక్స్ పోజింగ్ కు బహుదూరం. కేవలం నటన తోనే ఆఫర్స్ అందుకున్న హీరోయిన్ గా సాయి పల్లవి రికార్డ్స్ క్రియేట్ చేసింది. కథ నచ్చకపోతే కథలో తన పాత్రకు ప్రాధన్యత లేకపోతే ఎంత గొప్ప హీరో సరసన ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేస్తుంది. అందుకే సాయి పల్లవి అంటే అంత స్పెషల్.. చేసిన సినిమాలు తక్కువే కానీ ఒక్కోటీ ఒక్కో పీస్.. ఆమె డాన్స్ చేస్తే నెమలి నాట్యం లాగా ఉంటుంది. పైగా స్పీడ్ డాన్సర్. మెగా స్టార్ చిరంజీవే ఆమెతో కలసి స్టెప్ వేయాలని కోరుకున్నారంటే ఈ బ్యూటీ సత్తా ఏంటో తెలుస్తుంది. మేకప్ లేకుండా నాచురల్ గా తన నవ్వుతో, డాన్స్ తో,నటనతో అందరిని ఫిదా చేస్తుంది.
మూవీకి ఒక సంవత్సరం బ్రేక్
అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి ఈ మధ్య సినిమాలకు దూరం అయ్యింది. దాదాపు ఏడాదిగా వెండితెరకు కనిపించని ఈ బ్యూటీ ఏమైనట్లు? సినిమాలు వదిలేసిందా? లేక పెళ్లి ప్రయత్నాల్లో ఉందా? లేక తన ఒరిజినల్ ప్రొఫెషన్ లోకి మారిపోయిందా? అభిమానులందరినీ ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి. అయితే తాజాసమాచారం ప్రకారం ఆమె కాలికి గాయమైందని, దానికి సర్జరీ చేశారనీ తెలుస్తోంది. మారీ 2 సినిమా కోసం ఓ డాన్స్ సీక్వెన్స్ లో ఆమె కాలికి గాయమైందని సమాచారం. దానికి సర్జరీ చేశారని అయినా డాన్స్ చేసేప్పుడు ఆ కాలు నొప్పి వస్తున్నందుకే రెస్ట్ లో ఉందని తెలుస్తోంది.
విరాట పర్వం తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు లేడీ పవర్ స్టార్. చివరగా 2022 లో రిలీజ్ అయిన గార్గి డబ్బింగ్ సినిమాతో ఆడియెన్స్ ను పలకరిచింది. ఆ తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా సాయి పల్లవి కమిట్ అవలేదు. ప్రస్తుతం తమిళ్ లో శివ కార్తికేయన్ సరసనా ఓ సినిమా అనౌన్స్ చేసింది. తమిళ సినిమాలు చేస్తోంది మరి తెలుగు సినిమాలెందుకు చేయడం లేదని తెగ ఫీల్ అయిపోయారు ఆమె అభిమానులు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఫైనల్ గా ఓ తెలుగు సినిమాకు సంతకం చేసేసింది ఈ లేడి పవర్ స్టార్. గతంలో నాగచైతన్య తో కలిసి లవ్ స్టారీ సినిమాలో నటించిన సాయి పల్లవి మరోసారి చైతన్య తో రొమాన్స్ చేసేందుకు ఓకే చెప్పింది. Love story
చై తో రెండోసారి జత Love story
కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు నాగచైతన్య. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ #NC23 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. హీరోయిగా సాయి పల్లవి కూడా జాయిన్ అయిపోయింది. అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి.
బాలీవుడ్ లోకి కూడా…
తెలుగుతో సహా తమిళ్ లో కూడా పలు చిత్రాలు ఓకే చేయగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది ఈ లేడి డాన్. స్టార్ హీరో ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నదని సమాచారం. నటనతో పాటు నృత్యానికి ప్రాధాన్యత ఉన్న కథాశం కావడంతో దర్శకుడు సాయిపల్లవి వైపు మొగ్గుచూపారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోన్నటాక్..