హిందూ సంప్రదాయం ప్రకారం, గణపతి కి అత్యంత ప్రీతికరమైన తిథి చతుర్థి ఈ తిధి కి చవితి అని కూడా పేరు. ఈ చతుర్థి తిథి వేళ రెండు రకాల పూజలను జరుపుకుంటారు. మొదటిది వరద చతుర్ధి అని.. రెండోది సంకష్ఠ హర చతుర్ధి(Sankatahara Chathurthi) అనే పేరిట పూజలు జరుపుకుంటారు. వీటిలో అమావాస్య ముగిసిన తర్వాత వచ్చే చతుర్ధిని ‘వరద చతుర్ధి’ అని, అదే విధంగా పౌర్ణమి ముగిసిన తర్వాత వచ్చే చతుర్థిని ‘సంకష్ఠి చతుర్థి’ లేదా సంకట హర చతుర్థి అని అంటారు. ఈ పవిత్రమైన గణపతికి ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని, తమ కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయని చాలా మంది నమ్ముతారు.
సాధారణంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి(Sankatahara Chathurthi) అని పిలుస్తారు. అయితే ఈసారి సంకష్టహర చతుర్థి సెప్టెంబర్ 2 వ తేదీన వస్తోంది. ఈ రోజున కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి.
పూజ విధానం :
- ఈ పూజ చేసేవారు తెల్లవారు జామున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి.
- ఆ రోజంతా ఉపవాసం ఉండాలట. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీస్కోవచ్చు.
- ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో మాలను చేసి స్వామి కి అలంకరించాలీ.
- వినాయకుని కి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి.
- ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక ఉపవాసాన్ని విరమించవచ్చట.
ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. నైవేద్యం సమర్పించి సంకటహర చతుర్థి వ్రతకథని చదువుకోవాలట.ఒకవేళ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ, వ్రతం చేయడం కానీ కుదరకపోతే.. ఆ రోజు ఓ నాలుగుసార్లు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్లి స్వామిని దర్శించుకుంటే ఉత్తమ ఫలితాలు అందుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
ఈ వ్రతం వల్ల ప్రయోజనాలు..
సంకటహర చతుర్థి(Sankatahara Chathurthi) రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందట. అసలు సంకట హర చతుర్థి అంటే నే సంకటాల(కష్టాలు, అడ్డంకులు)ను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.
అలాగే సంకష్టహర చతుర్థి రోజున నారికేళం అంటే టెంకాయల తో చేసే కొబ్బరి కాయ మాలను గణపతి కి సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
అంతేకాదు. ఈ నారికేళాన్ని సంకష్ట హర చతుర్థి పూజకు ముగిసిన తరువాత ఆలయం నుంచి ఇంటికి తెచ్చుకుని ఆ నారికేళాన్ని పసుపు, కుంకుమల తో అలంకరించి .. రోజు పూజచేస్తే అష్టఐశ్వర్యాలు కలుగుతాయని అంతేకాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయట . కోరిన కోరిక నెరవేరిన తర్వాత ఆ టెంకాయను ప్రవహించే నీటిలో జారవిడవడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు .
ఈ మంత్రాలతో శుభ ఫలితాలు..
ఈ పవిత్రమైన రోజున తమ కుటుంబం, పిల్లలందరూ ఆరోగ్యంతో ఉండాలని, అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుతూ గణపతి ని పూజిస్తారు. ఈ పూజ లో వినాయక మంత్రాలను పఠించడం వల్ల ఆస్వామి అనుగ్రహం పొందుతారు. ఈ సందర్భంగా సంకట హర చతుర్థి రోజున ఈ వినాయక మంత్రాలను జపిస్తే శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.
వినాయక మంత్రాలు
- ‘‘ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయా ధీమఃతన్నో దన్తిఃప్రచోదయాత్..
2.వక్రతుండ మహాకాయ.. కోటి సూర్య సమప్రభ..నిర్విఘ్నం కురుమే దేవ.. సర్వకార్యేషు సర్వదా..
- ఓం గం గణపతయే నమః’’
- ఓం విఘ్నేశ్వరాయ నమః