స్కూలు బస్సు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. స్కూలు బస్సు అతి వేగంతో వచ్చి కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న ఆరుగురు మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని మేరఠ్ – ఢిల్లీ ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
రాంగ్ రూట్ లో వచ్చి…
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారరు. అయితే ఈ ప్రమాదానికి రెండు కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. ఒకటి పాఠశాల బస్సు రాంగ్ రూట్ లో రావడం, రెండోది అతివేగమనిప పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పిల్లలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తతీసుకుని విచారిస్తున్నారు.