తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు పొడగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నేడు కూడా విద్యాసంస్థలకు సెలవులను శనివారం వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ట్రాఫిక్ సమస్యలు…
గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఐటీ సిబ్బందిని కూడా వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయి ఇబ్బందిగా మారింది.