సైనో సైటిస్… (sinusitis) ఈ వ్యాధి ముదిరితే ఎంత ఇబ్బంది కర పరిస్థితులుంటాయో తెలిపే కథనం ఇది… సైనస్ సమస్య మనలో చాలామందిని వేధిస్తూనే ఉంటుంది.. చాలా మందికి మందులతో తగ్గుతుంది.మరికొందరు నిర్లక్ష్యం చేస్తూ తిరిగేస్తూ ఉంటారు..కానీ ఆ నిర్లక్ష్యం ఒక్కోసారి ప్రాణాలమీదకి వస్తుంది .
కాలిఫోర్నియాలో ఓ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కి ఏకంగా మెదడులో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది.
సైనస్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ కు పాకడంతో గతిలేని పరిస్థితుల్లో వైద్యులు ఇలా చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన 2021లో జరిగింది. బాధితురాలు ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఫోటోలు పెట్టి తన అనుభవాన్ని షేర్ చేసుకోవడంతో వెలుగులోకి వచ్చింది.నతాషా గుంథర్ అనే 26 ఏళ్ల మహిళ సైనో సైటిస్ తో అత్యంత భయానక అనుభవాన్ని ఎదుర్కొంది.
వాంతులు, మైగ్రేయిన్ తో ఇబ్బందులు (sinusitis)
మొదట్లో సైనస్ (sinusitis) సమస్యను పెద్ద సమస్యగా భావించలేదు. చలి పెడుతుండటంతో ఏదో చిన్న పాటి ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుందని భావించింది. డాక్టర్లను కలిస్తే సైనస్ కు సంబంధించి ఐదు వేర్వేరు రకాల ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతోందని గుర్తించి యాంటిబయోటిక్స్ ఇచ్చారు. అయితే నతాషా ఆరోగ్యం మాత్రం మెరుగు కాలేదు సరికదా మరింత క్షీణించింది. తరచుగా వాంతులు కావడం, మైగ్రేన్ సమస్యలతో ఆమె ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడే డాక్టర్లు ఆమెకు ఒక భయంకరమైన నిజాన్ని వెల్లడించారు. తక్షణం ఆపరేషన్ చేయాలని, వారం రోజులు ఆలస్యమైతే ప్రాణాలే పోతాయని తెలిపారు. ఆమె మెదడును స్కాన్ చేయగా మెదడులో సగభాగం ఇన్ఫెక్షన్ తో పాడైపోయిందని వెంటనే సర్జరీ చేయాలని తేలింది. పుర్రెలో కొంత భాగాన్ని, చిన్న ముక్కను తొలగించకపోతే ఆమె కుడివైపు మెదడుపై పడుతున్న ఒత్తిడిని తట్టుకోవడం కష్టమని డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు.అది మొదలుకొని అలా ఆమెకు మొత్తం ఏడు ఆపరేషన్లు జరిగాయి. నాలుగు బ్రెయిన్ సర్జరీలు, మూడు సైనస్ సర్జరీలు మొత్తం ఏడు సర్జరీలు చేస్తేనే కానీ నతాషా ప్రాణం నిలబడలేదు.
మెదడులో కొంత భాగం తొలగించాల్సి రావడంతో ఆమెకు ఆపరేషన్ అనంతర సమస్యలు కూడా పెరిగాయి. మూర్ఛరోగం, నరాల్లో రక్తం గడ్డ కట్టేయడంలాంటి సమస్యలు ఎక్కువయ్యాయి. అలాగే మెదడులో కొంత భాగాన్ని తొలగించడం వల్ల ఆమెకు మాట, నడక కూడా దెబ్బతిన్నాయి. మళ్లీ కొన్ని అత్యవసర థెరపీలతో ఆమె రోజు వారి దిన చర్యను నెట్టుకు రాగలిగింది.
ఈ ప్రతికూల రియాక్షన్లన్నింటినీ అధిగమించాక ఆమెకు చివరి సారిగా మరోసారి బ్రెయిన్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆమెకు ఎడమ చెవి వెనక భాగంలో ఒక రంథ్రం ఉంది.అలాగే తలపై మధ్య భాగంపై నిలువుగా పొడవైన కుట్లు వేశారు. బరువైన వస్తువులు తలపై పడకుండా, ఆప్రాంతానికి దెబ్బ తగలకుండా ఉండేందుకు ఆమెను ప్రత్యేకంగా తయారు చేసిన హెల్మెట్ ధరించమని చెప్పారు.
ఏడాదిగా ఇంటికే పరిమితం… (sinusitis)
దాదాపు ఏడాది వరకూ నతాషా గుంపులు, సమూహాల్లోకి వెళ్లేందుకు భయపడేది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనకు తోడున్న వారు ధైర్యం కల్పిస్తే ఆ భరోసాయే వేరు. నతాషాకు ఆమె భర్త నిత్యం ఆమె వెంట ఉండి సహయ సహకారాలు ఇవ్వడం వల్ల పూర్తిగా కోలుకోగలిగింది.హెల్మెట్ ధరించినా తాను ఎన్నడూ ఒంటరిగా బయటకు వెళ్లలేదని నతాషా చెబుతోంది. కేవలం డాక్టర్ చెకప్ కు మాత్రమే తాను బయటకు వెళ్లినట్లు, నాలుగైదు సార్లు దగ్గరలోని షాపింగ్ మాల్ కు మాత్రం వెళ్లినట్లు తెలిపింది. బయటకు రావాల్సి వస్తే మాత్రం హెల్మెట్ ధరించి దానిపై హుడీ వేసుకుని మాత్రమే ఆమె కనిపించేది. మెదడుకు భారీ ఆపరేషన్..
ఆపరేషన్ల గుర్తులతో తన మెదడు పైభాగం చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుందని అందుకే తాను బయటకు చూపననీ ఆమె చెబుతోంది. ఎవరైనా తన వైపుకు దగ్గరగా వచ్చినా, సరదాగా తనపై వాలినా తలకు ఎక్కడ దెబ్బ తగులుతుందోనన్న భయం వేధించేదని నతాషా తెలిపింది.తన మెదడుకు మళ్లీ ఏం దెబ్బ తగులుతుందోనని నిత్యం భయంతో బతికినట్లు, ఆభావన తనను చాలాకాలం వెంటాడిందని తెలిపింది. ఆత్మనూన్యతతో డిప్రెషన్ లోకి కూడా నతాషా వెళ్లిపోయింది.ఆపరేషన్లు వాటి దుష్ర్పభావాలను కొన్ని నెలల పాటు అనుభవించాక ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. తిరిగి మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా పని చేయడం మొదలు పెట్టింది.ఎంతో సంతోషంగా ఉంటున్న ఈజంట ఈమధ్యే తల్లిదండ్రులయ్యారు.పండంటి బాబుకు జన్మ నిచ్చారు. ఇప్పటికీ తనకు తరచుగా తలనొప్పి వస్తుందని,కానీ జీవితంలో సర్దుకుపోవడం నేర్చుకున్నానని , ఉన్నంతలోనే అందమైన జీవితాన్ని అనుభవించాలని నిర్ణయించుకున్నానని నతాషా స్పష్టం చేసింది.
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు
సైనోసైటిస్ (sinusitis) ని నిర్లక్ష్యం చేయకండి..తరచుగా బాధపెడుతుంటే తగ్గకుండా వేధిస్తుంటే తప్పనిసరిగా డాక్టర్ ని కలవండి. ఈఎన్టీ స్పెషలిస్ట్ సహాయంతో ఆ సమస్యని పరిష్కరించుకోండి.. లేకపోతే నాలాగే అవస్థలు పడతారు అని సలహా ఇస్తోంది నతాషా.తన భయంకర అనుభవాలను టిక్ టాక్ స్టోరీలుగా ఆమె షేర్ చేసుకుంటోంది.