సాంకేతికతను మెరుగుపరచడం, డేటా నిర్వహణను పెంచడం ద్వారా పౌరుల జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,538 కోట్లు విడుదల అయినట్లు , అందులో రూ.2726.43 కోట్లు రాష్ట్రం వరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ సహాయ శాఖ మంత్రి కౌశల్ కిషోర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ఈ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా కేంద్ర 100 నగరాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలు ఎంపిక చేయబడ్డాయని.. ఈ నాలుగు నగరాల్లో 279 స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఆమోదం పొందాయని తెలిపారు. వీటిలో 203 ప్రాజెక్టులు 73% పూర్తి కాగా, మిగిలిన 76 ప్రాజెక్టులు 27% ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.
విడుదల అయిన నిధుల్లో.. విశాఖపట్నం అత్యధిక నిధులు వినియోగించగా, తిరుపతి, కాకినాడ, అమరావతి తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వివరణ ఇచ్చారు. ప్రాజెక్టుల విషయానికి వస్తే. తిరుపతిలో అత్యధికంగా 105 ప్రాజెక్టులు ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కాకినాడలో 94, విశాఖపట్నంలో 61, అమరావతిలో 19 ఉన్నాయని తెలిపారు.
ఈ నగరాలలో ప్రాజెక్టుల పూర్తి కావటంలో.. తిరుపతి లో 60%, కాకినాడ -76.60%, విశాఖపట్నం – 91.8%, అమరావతి – 63.16% గా ఉందని పేర్కొన్నారు.