శ్రావణ మాసం లో వచ్చే అమావాస్య ని పొలాల అమావాస్య సర్వ అమావాస్య అంటారు. స్త్రీలు చేసే ఏ వ్రతాలు అయిన తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల కోసం చేస్తారు అలంటి ఈ వ్రతాన్ని ఈ పొలాల అమావాస్య రోజు మాత్రమే చేయాలట. ప్రతి వ్రతాన్ని ఒక పేరు ఉన్నట్టు ఈ వ్రతానికి కూడా పేరు ఉంది ఈ పొలాల అమావాస్య రోజు చేసే వ్రతాన్ని పొలాల అమావాస్య వ్రతం అని పొలంబిక వ్రతం(Polambhika Vratham) అని కూడా అంటారు. అసలు ఈ పొలాల అమావాస్య వ్రతం ఎలా మొదలైంది ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందాం..
పొలంబిక వ్రతం :
ఈ పొలంబిక వ్రతం (Polambhika Vratham) లో భాగం గా కంద పిలకలును గాని కంద మొక్కలను గాని పీఠం మీద పెట్టి పసుపు కొమ్ము తోరాలను, అబ్బాయిలు ఉన్నవారు లేదా మెగా సంతానం కోరుకునే వారు బూరెల దందాను వేయాలట అదే అమ్మాయిలు ఉన్నవారు కానీ ఆడపిల్ల సంతానం గ కావాలనుకునే వారు గారెల దండను ను సంపర్పించాలట. తరువాత పసుపు గణపతి ని చేసి, గణపతి కి షోడశోయుపచారా పూజ చేయాలట.ఆ తరువాత రెండు కంద మొక్కలు మట్టి తో ఒక కంద మొక్క గ చేసి ఆ కంద మొక్క లో కి గౌరమ్మ ను కానీ,పోలేరమ్మను కానీ, సంతాన లక్ష్మి ని కానీ ఆవాహన చేసాక షోడశోపచార పూజ చేసి పోలేరమ్మ అష్టోత్తర శతనామవాలి పట్టించి వ్రాత కధ కచ్చితం గ చదవాలట.
ఆ తరువాత ఈ పొలంబిక వ్రతం (Polambhika Vratham) లో ముఖ్యమైన అమ్మవారికి ఇష్టమైన పాల తాళికలు,9 రకాల కాయకూరల తో కలగాయ కూర చేసి(నూనె లేకుండా నెయ్యి లేకుండా తాలింపు పెట్టకుండా) నివేదన చేయలట. మిగిలిన తోరాన్ని కంద మొక్క కు ఒకటి ,ఆఖరి సంతానం మొల లో ఇంకోటి కట్టడం వలన పిల్లలు దీర్ఘాయుష్షులు అవుతారని పండితులు చెబుతున్నారు.
వ్రత కథ :
పూర్వం పిల్లలమఱ్ఱి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్తపండితుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి, కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్దకోడళ్ళు ఆరుగురికీ పిల్లలు పుట్టారు గానీ, చిన్నకోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూండడం జరిగేది. అలా ఆరుసార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికీ ఆ ఆరు సంవత్సరాలూ ‘పోలాల అమావాస్య వ్రతం’ (Polambhika Vratham) చేసుకోవడం కుదరలేదు.
అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈ సారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్దకొడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్యనాడు సుగుణకు ప్రసవమై, మృతశిశువును కంది. ఈ సంగతి తోటికోడళ్ళకు తెలిప్తే తనను వ్రతానికి పిలవరని తలచి, చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలమూట వుంచి తన తోటికోడళ్ళతో కలిసి ‘పోలాల అమావాస్య వ్రతాన్ని’ ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో స్మశానానికి వచ్చి, గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని, కన్నీరు మున్నీరుగా విలపించ సాగింది. అప్పటికి బాగా చీకటి పడింది.
ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలు దేరిన పోలాలమ్మదేవి, సుగుణ దగ్గరకు వచ్చి ‘ఎందుకు రోదిస్తున్నావు’ అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, ‘ సుగుణా.., బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి, ఏ పేర్లయితే నీ పిల్లలకు పెట్టాలను కున్నావో ఆ పేర్లతో వారిని పిలు’ అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరుపేరునా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని, వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ, పిల్లా,పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి, తరించింది.