తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. ఇప్పటి వరకూ 2216 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు. నేడు 169వ రోజుకు యువగళం పాదయాత్ర చేరుకుంది. అద్దంకి నియోజకవర్గం గుండ్లాపల్లి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి అద్దంకి నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది.
వరస సమావేశాలతో….
5.10 గంటలకు తిమ్మన్నపాలెం మాదిగపల్లిలో దళితులతో నారా లోకేష్ సమావేశం కానున్నారు. అనంతరం స్థానికులతో సమావేశమై స్థానిక సమస్యలపై లోకేష్ చర్చించనున్నారు. అనంతరం మేదరమెట్లకు చేరుకుని రాత్రి 6.55 గంటలకు రైతులతో లోకేష్ సమావేశమవుతారు. మేదరమెట్ల బస్టాండ్ వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు. 7.35 గంటలకు అద్దంకి అండర్ పాస్ వద్ద హార్టీకల్చర్ రైతులతో భేటీ అయి వారి సమస్యలపై చర్చించనున్నారు. రాత్రి 7.45 గంటలకు ఆర్.కె. పురంలో స్థానికులతో సమావేశం కానున్నారు. రాత్రి 10.15 గంటలకు మధురానగర్లో లోకేష్ రాత్రి బస చేయనున్నారు.