తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్ మరణించారు. గుండెపోటుతో సాయిచంద్ మృతి చెందడంతో తెలంగాణ ఒక ఉద్యమకారుడిని కోల్పోయింది. 39 ఏళ్ళ వయసులోనే సాయిచంద్ మరణించటం దిగ్భ్రాంతి కలిగించింది. సాయిచంద్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
ఫార్మ్ హౌస్ లో ఉండగా…
సాయిచంద్ తన కుటుంబసభ్యులతో కలిసి కారుకొండలోని తన ఫార్మ్ హౌస్ కు వెళ్లారు. బుధవారం రాత్రి ఫార్మ్ హౌస్ లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు నాగర్కర్నూల్ లోని గాయత్రి హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్ లోని ఏఎంజీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి
ఏఎంజీ హాస్పిటల్ లో వైద్యులు పరీక్షలు చేస్తుండగానే సాయిచంద్ మృతి చెందినట్లు వైద్దులు తెలిపారు. సాయిచంద్ మృతి తో తెలంగాణ ఒక ఫోక్ సింగర్ ని కోల్పోయినట్లయింది. సాయిచంద్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. అయన మృతి బాధాకరమన్న కేసీఆర్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
Follow Us On : YouTube , Google News